మహిళ బట్టలూడదీసి మర్మాంగంలో జీడిపోసి...
x

మహిళ బట్టలూడదీసి మర్మాంగంలో జీడిపోసి...

హన్మకొండ జిల్లా ధర్మసాగరంలో అమానవీయ ఘటన


నాగరికత ఎంత పెరిగినా అనాగరిక చర్యలు సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలను దిక్కరించి కొందరు వేసే శిక్షలు సభ్య సమాజం తల వంచేలా చేస్తుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ బట్టలూడదీసి ఆమె జనానంగంలో జీడిపోసిన వైనం తెలంగాణ హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది.

జీడి పోయడం అంటే ఆటవిక చర్య అని చెప్పొచ్చు. ఊష్ణ మండలప్రాంతాల్లో జీడిసాగు విరివిగా సాగవుతుంది. మనం తినే జీడిపప్పు జీడిపండుకు చివరగా కాస్తుంది. జీడిపప్పు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు విరివిగా ఉంటే జీడి గింజల వల్ల అనర్థాలే ఎక్కువ. వశీకరణ వంటి సామాజిక రుగ్మతలకు నల్ల జీడిగింజతో ట్రీట్ మెంట్ చేస్తారు. కొన్నిరకాల నొప్పులకు ఆయుర్వేద వైద్యులు జీడిగింజలను వాడుతున్నారు. జీడి గింజ రసం చర్మం మీదపడితే బొబ్బెలు వస్తాయి. ఆ గాయాలు త్వరగా మానవు. ఇంతటి ప్రమాదకరమైన జీడిరసాన్ని అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళ జననాంగంలో పోశారు. తప్పు అయిపోయింది అని ఆ మహిళ ప్రాధేయపడుతున్నప్పటికీ గ్రామస్థులు ఊరుకోలేదు.జీడి రసాన్ని జననాంగంలో పోయడంతో అక్కడ రక్తం కారింది. అయినా గ్రామస్థులు ఊరుకోలేదు.

తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బొలేనిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిపించారు. వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. అయితే ఆ వ్యక్తికి సమీప బంధువుతో అక్రమ సంబంధం ఏర్పడింది. పదిరోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అతను అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళతో ఉంటున్నాడు. తన భర్త అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వైనాన్ని తాటికాయల గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు కూతురు చేరవేసింది. అల్లుడు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను తాటి కాయల గ్రామానికి తీసుకొచ్చారు. ఆ మహిళను చెట్టుకు కట్టేసారు. వివస్త్ర ను చేసి కొట్టారు. అంతటితో ఆగకుండా జీడి గింజ రసాన్ని ఆమె మర్మాంగంలో పోసారు.తాటికాయల ఘటనపై హన్మకొండ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే కొందరు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. న్యాయ ప్రాధికార సంస్థ టీమ్ తాటికాయల గ్రామానికి చేరుకుని విచారణ చేస్తోంది.హన్మకొండ జిల్లా ధర్మ సాగరం మండలం తాటికాయల గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన మానవ హక్కులను పూర్తిగా హరించివేసింది.

Read More
Next Story