
నిరుద్యోగులు, విద్యార్థులతో భేటీ అయిన హరీష్ రావు
ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన బిఆర్ఎస్
నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రేస్ తీరుపై ఈ సందర్బంగా ఆయన మండిపడ్డారు.
తెలంగాణ భవన్ లో నిరుద్యోగులు, విద్యార్థులతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. జాబ్ కేలండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికలలో నిరుద్యోగులకు తన వైపు తిప్పికున్నారు అని అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చింది కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమేనని హరీష్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డగా కాంగ్రెస్ చెప్పుకుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల లోపు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే నిరుద్యోగులు తమ సత్తా చాటుతారన్నాని హరీష్ రావ్ హెచ్చరించారు. . గ్రూప్ వన్ లో అనేక అక్రమాలు జరిగాయన్నారు. నోటిఫికేషన్ వచ్చాక మార్పులు ఉండవని చెప్పి మార్పులు చేశారన్నారు. క్రిందిస్థాయిలో కాంగ్రేస్ నేతలు నిరుద్యోగులపై దాడులు చేస్తున్నారన్నారు. మెగా డీఎస్సీ అంటూ రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎన్నికలలో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. జాబ్ కేలండర్ ప్రకటించకపోవడం వల్ల నిరుద్యోగులకు వ్యయప్రయాసాలు పెరిగాయి అని హరీష్ రావు అన్నారు.
ఛలో సెక్రటేరియట్
నిరుద్యోగ సంఘం నేత మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగుల్లో ఓపిక నశిస్తోందన్నారు. తిరుగుబాటే శరణ్యం అంటూ ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగులపై రాజకీయ ముద్ర వేశారన్నారు. నిరుద్యోగి ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి బిఆర్ఎస్ పిలుపుఇచ్చినట్టు ఆయన పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రేస్ ను మట్టికరిపించడానికి బిఆర్ఎస్ వేసిన ప్రణాళికలో నిరుద్యోగ సమస్య చోటుచేసుకుంది. గత ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ నిరుద్యోగ అశం మీద ఎన్నికల బరిలో దిగింది. నిరుద్యోగుల మద్దత్తుతో కాంగ్రెస్ పార్టీ గెలుపుసాధ్యమైంది. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో నిరుద్యోగ సమస్యను ఫోకస్ చేస్తూ బిఆర్ఎస్ లబ్ది పొందాలని చూస్తుంది.