
హెచ్ సిఏ స్కాం నిందితులను 10 రోజుల కస్టడికి ఇవ్వండి
మల్కాజ్ గిరి కోర్టులో సిఐడి పిటిషన్
హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సి ఏ) స్కాంలో రిమాండ్ లో ఉన్న ఐదుగురు నిందితులను 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని మల్కాజ్ గిరి కోర్టులో సిఐడి సోమవారం పిటిషన్ వేసింది. హెచ్ సి ఎ స్కాంలో ప్రధాన నిందితుడైన జగన్ మోహన్ రావుతో పాటు మిగతా నలుగురు నిందితులను రిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటే శైలజా యాదవ్ చెంచల్ గూడలోని మహిళాసెల్ లో ఉన్నారు. ఈ కేసులో మరో నిందితుడు దేవరాజ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో 170 కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలున్నాయి
Next Story