
హైదరాబాద్ గాజులకు అందాల భామల ఫిదా
చార్మినార్ చెంత మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల కాంతుల మధ్య ప్రపంచ సుందరీమణులు మెరిశారు.లాడ్ బజార్ లో గాజులు చూసిన ముద్దుగుమ్మలు వాటిని వేసుకొని మురిసిపోయారు.
చార్మినార్ చెంత ఉన్న లాడ్ బజార్ లో హైదరాబాద్ గాజులను చూసిన ప్రపంచ అందకత్తెలు వాటిని కొనుగోలు చేసి చేతులకు తొడుక్కున్నారు. 109 దేశాల ముద్దుగుమ్మలు లాడ్ బజార్ లో నృత్యం చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. లాడ్ బజార్ లో గాజుల దుకాణాల్లో పలు రకాల గాజులను అందాల భామలు కొనుగోలు చేశారు. చార్మినార్ నుంచి లాడ్ బజార్ లో అందాల భామలు వాక్ చేశారు.
ప్రపంచ దేశాల అందాల భామలను హైదరాబాద్ ముత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు భామలు ముత్యాల హారాలు, గాజులను కొనుగోలు చేశారు. ముత్యాలు, గాజులను ఆసక్తికరంగా పరిశీలిస్తూ వాటి వివరాలు తెలుసుకుంటూ కొనుగోలు చేశారు. స్థానిక వ్యాపారులతో ముచ్చటించి వారు అమ్మే వస్తువుల వివరాలు తెలుసుకున్నారు.
అందాల భామలకు రాష్ట్ర ప్రభుత్వం విందు
మిస్ వరల్డ్ పోటీదారులను రాజ వైభవంలో స్వాగతించారు. చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ కార్యక్రమం ముగిసింది. చౌమల్లా ప్యాలెస్ లో వేడుకలు ప్రారంభం అయ్యాయి.ప్రభుత్వ ఆధ్వర్యంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు విందు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
అందాలభామల ఫోటోషూట్
లాడ్ బజార్ వ్యాపారుల ఉదారత