వార్నింగ్: హైడ్రా గుప్పిట్లోకి అన్ని జిల్లాలు
x

వార్నింగ్: హైడ్రా గుప్పిట్లోకి అన్ని జిల్లాలు

తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమణలపై ఫోకస్ చేసిన హైడ్రా త్వరలో జిల్లాలోకి ప్రవేశిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.


తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమణలపై ఫోకస్ చేసిన హైడ్రా త్వరలో జిల్లాలోకి ప్రవేశిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముందుగా రాజధాని నగరంలో.. తరువాత అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమణకు గురయ్యాయో వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భౌగోళిక పరిస్థితుల్లో కాలుష్యం నుండి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గతంలో ఉన్న చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువులను పరిరక్షించుకోవాలని స్వచ్ఛంద సంస్థలు, గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసిన స్థానికులు ఎవరైనా పోలిసు అధికారులకు కానీ, రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకురావాలి అని పిలునిచ్చారు.

ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదు అని చెప్పిన పొన్నం... ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే న్యాయ స్థానాలు ఉన్నాయి, చెరువుల ఆక్రమణల పై ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పారు. హైదరాబాద్ ఒకప్పుడు లేక్ సిటీ గా ఉండేది.. ఇప్పుడు కబ్జాల పాలై చెరువుల ఆనవాళ్లు లేకుండా పోయాయని అన్నారు. చెరువుల పరిరక్షకులు ఎక్కడెక్కడ అక్రందనకు గురయ్యాయో వాటి ఆధారాలు, ఆనవాళ్లు సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరారు. "33 జిల్లాల్లో ఎక్కడైనా గ్రామాలు, మండలాలు, పట్టణాలు, మున్సిపాలిటీ చెరువులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాల్లో మీకు ఉన్న అవగాహన, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. ప్రజలంతా ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం కావాలి" అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.


Read More
Next Story