‘అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు’
x

‘అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు’

కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటపెట్టాలన్న ఈటల.


కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన విచారణ, కమిషన్ నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలన్నీ కూడా కేసీఆర్, హరీష్ రావు దగ్గరే ఉన్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తన పాత్రేమీ లేదని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారని, దానిని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఛైర్మన్‌గా ఉండి నడిపించారని చెప్పారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకునే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

‘‘కాళేశ్వరం కమీషన్ రిపోర్ట్ త్వరగా బయటపెట్టాలి.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ రాజకీయపబ్బం గడపవద్దని కాంగ్రెస్ ను హెచ్చరిస్తున్నా. ఏ పార్టీలో ఉన్నా నేను విలువలతో కూడిన రాజకీయ నాయకునిగా కొనసాగుతున్నా. రూ.16,500 కోట్లతో తుమ్మిడిహట్టి - చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టారు. మళ్ళీ దానిని రూ.38 వేల కోట్లకు పెంచారు. 152 మీటర్లు బ్యారేజి ప్రపోజల్స్ ఉంటే మహారాష్ట్ర అభ్యంతరాలతో 148 మీటర్లు తగ్గించింది. దీనివల్ల మనకు సరిపడా నీళ్లు రావని.. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం హరీష్, తుమ్మల నన్ను కలిపి మంత్రివర్గ ఉపసంఘం వేసారు. టెక్నికల్ టీమ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని చెప్పారు. రూ.63 వేల కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. అది రూ.82 వేల కోట్లకు వెళ్లింది. తరువాత ఎంత పెరిగిందో నాకు అవగాహన లేదు’’ అని తెలిపారు.

‘‘డిజైన్స్, కన్స్ట్రక్షన్ తో సంబంధం ఉందా అని అడిగారు.. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు అని చెప్పాను. కార్పొరేషన్ రుణాల మీద అజమాయిషీ ఉందా అని అడిగారు.. లేదు అని చెప్పాను. ఇరిగేషన్ డిపార్ట్ లోనే అకౌంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ లు పనులు, నాణ్యత చెల్లిపులు వారే చేసుకున్నారు తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. మా బ్రతుకు ట్రసపరెంట్ గా ఉన్నాయి. కణత మీద తుపాకీ పెట్టిన విలువలు పోగొట్టుకోము. పిచ్చి కూతలు బంద్ పెట్టండి. మీరెన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. బట్టకాల్చి మీద వేయడం మానేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.. బీజేపీ చట్టాన్ని న్యాయాన్ని గౌరవించే పార్టీ. కమీషన్ రిపోర్ట్ త్వరగా బయటపెట్టి నిజమైన దోషులను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నా. రాజకీయ పబ్బం గడిపితే ఊరుకోము. రిపోర్ట్ బయట పెట్టు. శిక్షించక పోతే నీ కు శిక్ష తప్పదు’’ అని హెచ్చరించారు. అంతేకాకుండా కేసీఆర్ వందల సార్లు కాళేశ్వరం సృష్టికర్త నేనే అని చెప్పుకున్నారని చెప్పారు. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దానిని క్యాబినెట్ తో ఆమోదింపజేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబధం. ఘోష్ రిపోర్ట్ బయటపెట్టి దోషులను శిక్షించండి అని కోరారు.

Read More
Next Story