టీడీపీ కండువా కప్పుకోనున్న మాజీ మంత్రి తీగల
x

టీడీపీ కండువా కప్పుకోనున్న మాజీ మంత్రి తీగల

మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే తాను టీడీపీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ, ఆనాటి సీఎం చంద్రబాబే కారణమని ఆయనను కొనియాడారు.


మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే తాను టీడీపీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ, ఆనాటి సీఎం చంద్రబాబే కారణమని ఆయనను కొనియాడారు. ఈరోజు ఉదయం మాజీ మంత్రులు మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మర్రి రాజవేఖర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగానే వారు టీడీపీలో చేరాలన్న ఆసక్తి చూపారని, వారిలో తీగల కృష్ణారెడ్డికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను టీడీపీలో చేరనున్నానన్నట్లు తీగల ప్రకటించడం ఈ వాదనలను బలోపేతం చేసింది. కాగా ఇప్పటికే తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం కృషి చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణలోని బలమైన నాయకులను టీడీపీలోకి ఆహ్వానించే ప్రయత్నంలో చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారని కూడా సమాచారం. ఈరోజు ముగ్గురు మాజీ మంత్రులతో భేటీ కూడా ఆ ప్రయత్నాల్లో భాగమేనని, ముగ్గురునీ టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు ఆసక్తి చూపారని, కానీ ప్రస్తుతానికి తీగల కృష్ణారెడ్డి మాత్రమే అధికారంగా తాను టీడీపీలో చేరనున్నన్నట్లు ప్రకటించారన్న మాట కూడా వినిపిస్తోంది. మరి మిగిలిన ఇద్దరూ దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఆ ఘనత బాబుదే..

ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు, టీడీపీ ఘనతే అని అన్నారు. ‘‘తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు ఉన్నారు. టీడీపీకి తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. త్వరలోనే ఆ పార్టీలో చేరనున్నాను. నాతో పాటు చాలా మంది నాయకులు టీడపీలో చేరనున్నారు’’ అని ఆయన ప్రకటించారు. కాగా ఈ సందర్బంగానే మీడియాతో మాట్లాడటానికి మాజీ మంత్రులు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌ నిరాకరించారు.

Read More
Next Story