కేసీఆర్ విచారణలో మార్పు ?
x
KCR

కేసీఆర్ విచారణలో మార్పు ?

బహుశా కమిషన్ విచారణకు సంబంధించి కేసీఆరే చివరి వ్యక్తి కావచ్చు


కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి కేసీఆర్ విచారణలో మార్పు జరిగింది. కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బుధవారం కేసీఆర్(KCR) విచారణకు హాజరవుతున్నారు. కేసీఆర్ విచారణను ‘కమిషన్ ఇన్ కెమెరా’ పద్దతిలో చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు విచారించిన 114 మందిని ‘ఓపెన్ కోర్టు’ పద్దతిలోనే కమిషన్ విచారించిన విషయం అందరికీ తెలిసిందే. బహుశా కమిషన్ విచారణకు సంబంధించి కేసీఆరే చివరి వ్యక్తి కావచ్చు. ఈనేపధ్యంలో కేసీఆర్ విచారణను కమిషన్ ఇన్ కెమెరా పద్దతిలో నిర్వహించాలని ఎందుకు నిర్ణయించిందో అర్ధంకావటంలేదు. ఇన్ కెమెరా విచారణ కావాలని కేసీఆరే అడిగారా ? లేకపోతే కమిషనే ఏర్పాటుచేసిందా అన్న విషయంలో క్లారిటేలేదు.

ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై కమిషన్ ఇప్పటివరకు విచారణకు హాజరైన వారందరినీ ఓపెన్ కోర్టు పద్దతిలోనే విచారించింది. క్రాస్ ఎగ్జామినేషన్ను కూడా ఓపెన్ కోర్టు పద్దతిలోనే నిర్వహించింది. ఓపెన్ కోర్టు పద్దతంటే కమిషన్ కు సంబంధించిన అందరు ఉంటారు. అందరిముందే కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నలు వేస్తారు, విచారణకు హాజరైన వారు సమాధానాలు చెబుతారు. ఈప్రక్రియ మొత్తాన్ని కమిషన్ సిబ్బంది రికార్డు చేశారు. మరిపుడు ఇన్ కెమెరా విచారణ కాబట్టి విచారణ సమయంలో ఛైర్మన్, కేసీఆర్ కాకుండా ఇంకా ఎవరెవరుంటారు అన్న విషయంలో క్లారిటిలేదు.

Read More
Next Story