
ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. మళ్ళీ బాలికలే టాపర్స్
ఈ పరీక్షలను తొలి, రెండో ఏడాది మొత్తం కలిపి 9.97 లక్షల మంది రాశారు.
తెలంగాణలో ఇంటర్ తొలి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ కలిసి విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయి. ఈ పరీక్షలను తొలి, రెండో ఏడాది మొత్తం కలిపి 9.97 లక్షల మంది రాశారు. ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ.. హాల్ టికెట్ నెంబర్ ను టైప్ చేసి సెర్చ్ చేస్తే స్క్రీన్పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్ షీట్ను ప్రింట్ కూడా చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.
Next Story