తెలంగాణకు అది ‘చీకటి రోజు’: పాలమూరు అధ్యయన వేదిక ప్రకటన
x

తెలంగాణకు అది ‘చీకటి రోజు’: పాలమూరు అధ్యయన వేదిక ప్రకటన

"భౌతిక దాడులతో తమ క్రూరత్వాన్ని మాత్రమే చాటుకోగలుగుతారు. బీజేపీ అధికారంలో ఉందని ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలు సహించరు."


వరంగల్లు రచయితలపైన, నిర్వాహకులపైన దాడి చేసి గాయపర్చడాన్ని, పాలమూరు అధ్యయన వేదిక(పిఎవి), జనసాహితి సంస్థలు తీవ్రంగా ఖండించాయి. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని, ప్రజాస్వామిక హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసే ఇలాంటి ధోరణులను ముక్త కంఠంతో ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని ఈ సంస్థలు పిలుసునిచ్చాయి. ఏప్రిల్ 29 తేదీని పిఎవి చీటకిరోజుగా పేర్కొంది.

ఆరోజు ఏజరిగిందో పాలమూరు అధ్యయన వేదిక ఇలా వివరించింది.

"కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాలులో ‘సమూహ’ సెక్యులర్ రైటర్స్ రాష్ట్ర స్థాయి నిర్వహించారు.సెక్యులర్ విలువలు వ్యాప్తికి కి సాహిత్యం ద్వారాఏవిధంగా కృషి జరగాలో ప్యానెల్ డిబేట్ కోసం ఏర్పాటు చేసిన వేదికపై పదహైదు మంది రచయితలు పాల్గొన్నారు. చర్చ జరుుగుతున్నపుడు ముగ్గరు ఏ బివిపి కార్యకర్తలు హాలులో ప్రవేశించి సభ నిర్వాహకులు ఎవరని, అనుమతి పత్రాలు చూపమని అరుస్తూ హాలులోకి ప్రవేశించి బూతులు అరుస్తూ ఉద్రిక్తత సృష్టించారు. అందరికి కలిసి ఆముగ్గురిని బయటకు పంపగా, వెళ్లినట్లే వెెళ్లి మరొక పది మందితో మరొకసారి దూసుకువచ్చారు. రెండోసారి ఒక పోలీసుతో మూడోసారి ముగ్గురు పోలీసులు, ఒకరిద్దరు ఎన్నికల కార్యాలయం ఉద్యోగులతో కలసి వచ్చారు. సభ ముగించాలని దబాయించారు. మాటలు ఒక వైపు జరుగుతుండగానే, ఆగంతకులు దాడికి పూనుకున్నారు. దాటిని నిలువరించడానికి చూసి పసునూరి రవీందర్ జీలుకర్ర శ్రీనివాస్, నరేసుకుమార్ సూఫీ తదిరులపై దౌర్జన్యానికి దిగారు. ఇదేమిటని నిలదీయగా పోలీసులు వారిని బయకుపంపారు.సభను అపాలని, వత్తిడి పెంచారు . ఈ సంఘర్షణలోనే గంటన్నర సమయం వృధా అయింది. దీనితో ప్యానెల్ డిబేట్ రద్దు చేయవలసి వచ్చింది బులెటీన్ మాత్రం ఆవిష్కరించారు. పోలీసుల సహకారంతో భావప్రకటనా స్వేచ్ఛను, సభ జరుపుకునే హక్కును భంగపరిచారు," అని పిఎవి పేర్కొొంది.

ఏబీవీపీ వారు సమాజానికి ఏమైనా చెప్పదలుచుకుంటే, వారు కూడా సభల ద్వారా చెప్పవచ్చు. భౌతిక దాడులతో తమ క్రూరత్వాన్ని మాత్రమే చాటుకోగలుగుతారని పీఏవీ అధ్యక్షులు ప్రొ. జీ.హరగోపాల్, కన్వీనర్ ఎం.రాఘవాచారి ప్రకటనలో పేర్కొన్నారు.

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి ఉందని ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలు సహించరని చెబుతూ మతోన్మాదం ఏ విధంగానూ సమస్యలకు పరిష్కారం చూపదని వారు పేర్కొన్నారు. " రాముని పేరు మీద ఇలాంటి దాడలకు దిగితే చరిత్ర క్షమించదు," అని చెబుతూ ఏప్రిల్ 28ని చీకటి రోజుగా ప్రకటించింది.

దాడికి పాల్పడిన వారు పోలీసులకు తెలుసని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కావాలని చూసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్, రాఘవాచారి కోరారు.

బీజేపీ అధికారంలో ఉందని ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలు సహించరు. మతోన్మాదం ఏ విధంగానూ సమస్యలకు పరిష్కారం చూపదు. రాముడు పేరుతో ఇలాంటి దాడులకు దిగితే చరిత్ర క్షమించదు. పాలమూరు అధ్యయన వేదిక నిన్నటి రోజును చీకటి రోజుగా ప్రకటిస్తుంది. దాడికి పాల్పడినవారు పోలీసులకు తెలుసు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి" అని ప్రకటన ద్వారా పీఏవీ డిమాండ్ చేసింది.

జనసాహితి ఖండన...

"తెలంగాణలో “సమూహ" పేరుతో ఏర్పడిన సెక్యులర్ రచయితల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో 28- 04-2024 ఆదివారం నాడు "లౌకిక విలువలు - సాహిత్యం" అనే అంశంపైన సభ జరిగింది. తెలంగాణలో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి సదస్సులోనికి చొరబడి, ఉన్మాదమే మతంగా భావించే గుంపు, దాడికి తెగబడ్డారు. ఎన్నికల కాలంలో ఇలాంటి సదస్సుకు కాకతీయ విశ్వవిద్యాలయం అనుమతి ఎలా ఇచ్చింది అంటూ నిర్వాహకులతో వాదనకు దిగి, అనుమతి రద్దు చేయాలంటూ సదస్సులో గందరగోళం సృష్టించారు. సదస్సులో చర్చకోసం పెట్టిన అంశాలపై చర్చించడానికే వీలు లేదంటూ మతోన్మాదంతో ఫత్వాలు జారీచేశారు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకై మణిపూర్ లో ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యంత నీచమైన హత్యాచారాలను ఈ గుంపు ఎప్పుడూ ఖండించలేదు. ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించిన మల్ల యోధురాండ్రపై జరిగిన అవమానకర వేధింపులను వీరు తప్పు పట్ట లేదు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైన సదస్సు అయితే ఎన్నికల అధికారులను వివరణ కోరి ఉండాలి. దానికి బదులుగా సాహిత్య సమావేశాన్ని జరగనివ్వకుండా దౌర్జన్యపూరితంగా వ్యవహరించడాన్ని జనసాహితి ఖండిస్తోంది".

"ప్రజా సాంస్కృతిక విధ్వంసాన్ని సృష్టిస్తున్న సామ్రాజ్యవాద దళారీ శక్తుల కిరాయి మూకల లాగా వీరు ముందుకొస్తున్నారు. ఎవరు ఏమి తినాలి? ఎవరు ఏమి మాట్లాడాలి? ఎటువంటి బట్టలు కట్టుకోవాలో మేమే నిర్ణయిస్తామనే స్థాయిలో సాగుతున్న నియంతృత్వ ఫత్వాలను శ్రామిక ప్రజలు, లౌకికశక్తులు, ప్రజాతంత్రవాదులు ఆమోదించరని, ఈ అసాంఘిక శక్తులకు అర్థమయ్యేలా మన సాహిత్య కృషిని కొనసాగిద్దాం. ప్రజలు నిత్యం ఎదుర్కొనే జీవన్మరణ సమస్యలపై ఎన్నడూ మాట్లాడని ఈ ఉన్మాదశక్తుల అసలు లక్ష్యాన్ని ప్రజలకి తెలియజేయాలి. ఇటువంటి పాలకవర్గ అనుకూల శక్తులపై ఆచరణలో నిత్యం సంఘటితంగా పోరాడాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పాల్సిన సాంస్కృతిక బాధ్యత నేడు మనందరిపై వుంది" అని ప్రకటనలో పేర్కొంది.




Read More
Next Story