
ఎమ్మెల్యే గోపీనాథ్కు సీరియస్..
తెలంగాణ రాజకీయాల్లో ఆయనకంటూ ప్రత్యేక స్థానం.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో గురువారం ఉదయం ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ఎంత ప్రయత్నించినా చికిత్సకు స్పందించలేదని వైద్యులు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేమని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలియడంతోనే హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అహర్నిశ్రలు శ్రమించారు. గల్ఫ్ దేశాల్లో నివసించే ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారానికి కూడా ఆయన ఎంతగానో పాటుపడ్డారు. వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీడీపీ తరపున పోటీలో నిలబడి ఎంఐఎంఐ అభ్యర్థిని ఓడించారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. ఆయన సినిమా ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మరణం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గోపీనాథ్ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆయన సేవలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని సంతాపం తెలుపుతున్నారు.
గోపీనాథ్ నేపథ్యం
మాగంటి గోపీనాథ్.. హైదరాబాద్ హైదర్గుడాలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయన తన పొలిటికల్ జర్నీని 1983లో తెలుగు దేశం పార్టీతో ప్రారంభించారు. 1985-1992 మధ్య ఆయన టీడీపీ యూత్ వింగ్ ‘తెలుగు యువత’ అధ్యక్షుడిగా ఉన్నారు. 1987-1989 మధ్య హైదరాబాద్ అర్బన్ డవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా కూడా విధులు నిర్వర్తించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 50,898 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి మారారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వాటిలో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిని 16,004 ఓట్ల తేడాతో ఓడించారు. 2023 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ అజారుద్దీన్ను 16,337 ఓట్ల తేడాతో ఓడించారు.