
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కవిత పోరుబాట
పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభం
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోరుబాట పట్టారు. ఈ సారి ఆమె కేవలం రాష్టంలో కాంగ్రెస్ పాలనను ప్రశ్నిస్తూ పోస్ట్ కార్డ్ ఉద్యమం మొదలు పెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, మహిళలకు 2 500 పెన్షన్ పెంపు అనే అంశాలపై ఆ మె పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సారి ఆమె ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధికే ఉత్తరాలు పంపించారు. హైద్రాబాద్ అబిడ్స్ లో ఉన్న జీపోవో నుంచి కవిత పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరన్నారు.
కెసీఆర్ తెలంగాణకు అన్యాయం చేయరు
తెలంగాణ తెచ్చింది కెసీఆర్ మాత్రమేనని తెలంగాణ సాధన కోసం పులి నోట్లో తల పెట్టి తెచ్చుకున్నారన్నారు. ఎ ట్టి పరిస్థితుల్లో ఆయన తెలంగాణకు అన్యాయం చేయరన్నారు. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించడం లేదన్నారు. వృద్దులకు పెన్షన్ రెండువేల నుంచి 4 వేలు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ఇచ్చి అటకెక్కించిందన్నారు. వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలకు ఇస్తానని కాంగ్రేస్ మోసం చేసిందన్నారు.ఆరు గ్యారెంటీలపై సోనియాగాంధీ సంతకం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సోనియాగాంధీ సంతకం చేసిన గ్యారెంటీ కార్డులను ఆమె ఇంటింటికి పంపించారు. సోనియా ముఖం చేసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారన్నారు. చివరకు ఆమె మోసం చేయడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిన నేపథ్యంలో సోనియాగాంధీ డైరెక్షన్ ఇవ్వాలని కవిత కోరారు.
అసెంబ్లీ లో చర్చిద్దాం
రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడటం అలవాటైందన్నారు. గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదన్నారు .అసెంబ్లీలో చర్చ పెడదామని కవిత రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దాం అని కవిత సవాల్ చేశారు.