mlc kavitha
x
Kalvankuntla kavitha

బీజేపీని రోడ్డునపడేసిన కవిత

పార్టీతో పాటు పేర్లు ప్రస్తావించకుండానే కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)పై ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలు చేస్తు రాజకీయాన్ని బాగా హీటెక్కించేస్తున్న విషయం తెలిసిందే.


ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందనే సామెత కల్వకుంట్ల కవిత వైఖరికి సరిగ్గా సరిపోతుంది. పార్టీలో తన సోదరుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పెరిగిపోయిన వివాదం కారణంగా బీజేపీలోని అంతర్గత విభేదాలు రోడ్డున పడేట్లుగా కవిత చేశారు. తన అన్నతో మొదలైన విభేదాలు పెరిగి పెద్దదైపోయిన నేపధ్యంలో పార్టీతో పాటు పేర్లు ప్రస్తావించకుండానే కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)పై ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలు చేస్తు రాజకీయాన్ని బాగా హీటెక్కించేస్తున్న విషయం తెలిసిందే. పనిలోపనిగా బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు కూడా కవిత(Kavitha) పుణ్యామని రోడ్డునపడ్డాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్(BRS) ను బీజేపీ(BJP)లో విలీనం చేసేందుకు చర్చలు జరిగాయని ఆరోపించిన విషయం తెలిసిందే. తాను జైలులో ఉండగా జరిగిన విలీన కుట్రను అడ్డుకున్నట్లు చెప్పారు. పార్టీతరపున జరిగిన విలీన చర్చలు ఎలాగున్నా బీజేపీ నేతలు మాత్రం తలోదారిలో స్పందిస్తున్నారు. కవిత చేసిన ఆరోపణలనుండి ఎలా బయటపడాలో కమలంపార్టీ నేతలకు అర్ధంకావటంలేదు. ఈ పాయింటులోనే బీజేపీ నేతల మధ్య సమన్వయంలేదన్న విషయం స్పష్టంగా అర్ధమైపోయింది. విలీన ప్రతిపాదనపై తెలంగాణ పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతు అదంతా ఉత్తదేఅన్నారు. పార్టీలో సోదరుడితో పెరిగిన వివాదాన్ని పరిష్కరించుకోలేక కవిత తమపార్టీపై అనవసరంగా బురదచల్లుతున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇదేసమయంలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మాట్లాడుతు విలీనం ప్రతిపాదన నిజమేఅన్నారు. తమపార్టీని బీజేపీలో విలీనంచేసుకోమని బీఆర్ఎస్ నుండి ప్రతిపాదనలు వచ్చినట్లు చెప్పారు. ఇదేవిషయమై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు(BJP MP Raghunandan Rao) మాట్లాడుతు రెండుపార్టీల మధ్య విలీనంచర్చలు జరగనేలేదన్నారు. బీఆర్ఎస్ ను విలీనంచేసుకోవాల్సిన అవసరం తమపార్టీకి ఏమొచ్చిందన్నారు. అంతకుముందు గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ మాట్లాడుతు విలీనం ప్రతిపాదనపై కవిత చెప్పింది నిజమే అని అంగీకరించారు. తాజాగా రాజ్యసభ ఎంపీ, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతు విలీనం ప్రతిపాదన అంతా ఉత్తదే అన్నారు. పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా విలీనం ప్రతిపాదన తనకు తెలీకుండానే ఉంటుందా అని మీడియాను ఎదురు ప్రశ్నించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విలీనం గురించి కారుపార్టీ నేతలు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదేమిటంటే కవిత అరెస్టు జరగకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని కమలంపార్టీ అగ్రనేతల నుండి బాగా ఒత్తిడి వచ్చిందని మాజీమంత్రి శ్రీనివాసగౌడ్ చెప్పారు. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే రెండుపార్టీల మధ్య విలీనంచర్చలు జరిగింది వాస్తవమే. అయితే ఏ పార్టీ నుండి మొదట ప్రతిపాదన మొదలైందన్న విషయమే అయోమయంగా ఉంది. బీజేపీ నేతలు మరచిపోయిన విషయం మరోటుంది. అదేమిటంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనపై నిర్ణయం నరేంద్రమోడి(Narendra Modi), అమిత్ షా(Amit Shah) మాత్రమే తీసుకుంటారు. అంతేకాని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలతో చర్చించి నిర్ణయం తీసుకోరు. విలీనానికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఆవిషయాన్ని తెలంగాణ నేతలతో చెప్పే అవకాశముంది.

ఇటు కేసీఆర్ అటు మోదీ, అమిత్ షాకు కావాల్సిన మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుగుతాయే కాని తెలంగాణ నేతల ద్వారా కాదు. కాబట్టి నిజంగానే విలీనం ప్రతిపాదన వచ్చున్నా, చర్చలుజరిగినా తెలంగాణ నేతలకు తెలిసే అవకాశాలు తక్కువనే చెప్పాలి. బహుశా ప్రతిపాదన బీఆర్ఎస్ నుండి వచ్చిందో, లేకపోతే బీజేపీ నుండి వెళ్ళిందో తెలీదుకాని ఎక్కడో బెడిసికొట్టుంటుంది. కీలకమైన విషయం ఏమిటంటే కిషన్ రెడ్డి విలీనం ఉత్తదే అన్నపుడు మరో మంత్రి బండి మౌనంగా ఉండిపోవచ్చు లేదా కిషన్ చెప్పిందాన్నే చెప్పచ్చు. కాని అలాకాకుండా విరుద్ధంగా చెప్పారు. అలాగే రాజాసింగ్ చెప్పిందానికి వ్యతిరేకంగా మెదక్ ఎంపీ మాట్లాడారు. బండి చెప్పిందాన్ని ఖండిస్తున్నట్లు మరో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. దీంతో ఏమైందంటే విలీనం విషయంలో బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు రోడ్డునపడ్డ విషయం మాత్రం స్పష్టమైంది.

Read More
Next Story