మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
x

మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఈరోజు మరో నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.


పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన ఆయన ఈరోజు మరో నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం చేవెళ్ల, వరంగల్ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. చేవెళ్ల నుంచి టీడీపీ వలస నేత కాటసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి కడియం కావ్య లను అనౌన్స్ చేశారు.

అలాగే ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ నుంచి పోటీలో ఉంటారా లేదా అనే ఉత్కంఠకు తెర దించుతూ.. ఆ స్థానానికి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని ఖరారు చేశారు. జహీరాబాద్ సెగ్మెంట్ కి గాలి అనిల్ కుమార్ పేరును ప్రకటించారు. కాగా, తొలి జాబితాలో ఖమ్మం లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ లోక్సభ స్థానానికి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి స్థానానికి కొప్పుల ఈశ్వర్ లను ప్రకటించారు. మంగళవారం మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కి శంభీపూర్ రాజును అనౌన్స్ చేశారు.

Read More
Next Story