KCR బీజేపీకి ఓట్లేయించాడు... సాక్ష్యాలున్నాయన్న కేకే
x

KCR బీజేపీకి ఓట్లేయించాడు... సాక్ష్యాలున్నాయన్న కేకే

కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ మోడీ దగ్గర మోకరిల్లిందని విమర్శించారు.


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ మోడీ దగ్గర మోకరిల్లిందని విమర్శించారు. లిక్కర్ రాణి, కూతురు కవితను జైలు నుండి విడిపించడానికి బీజేపీకి కేసీఆర్ ఓట్లు వేయించాడని, తన దగ్గర సాక్ష్యాలున్నాయని ఆయన అన్నారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తనపై చేస్తోన్న ఆరోపణలపై స్పందించారు. పద్మశాలీలు నిరోద్ లు అమ్ముకోవాలంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా కేసీఆర్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేకే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు వేరే వ్యక్తితో మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలని, తాను పద్మశాలీలను అనలేదని.. తన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఫేక్ వీడియో క్రియేట్ చేసి వైరల్ చేశారని చెప్పుకొచ్చారు.

మోడీ కనుసన్నల్లో కేసీఆర్ ఉన్నాడన్న ఆయన.. కొడుకుని ముఖ్యమంత్రి ని చేయాలని నన్ను అడిగాడని స్వయంగా మోడీనే చెప్పాడని కేకే గుర్తు చేశారు. "వాళ్ళ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏంటో తెలియాలి. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతుండు. కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ ఎవరు కోన్ కిస్కా. బీఆర్ఎస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. అధికారంలో ఉన్నప్పుడు జల దోపిడీ చేసిండ్రు. సిరిసిల్ల జిల్లా పొలాలను ఎండబెట్టి, ఆయన పొలాలకు నీళ్లు తీసుకెళ్లిండు.. బతుకమ్మ చీరల పేరుతో కేటీఆర్ దోపిడీ చేసిండు" అని ఆరోపించారు.

Read More
Next Story