
శ్రీశైలం ప్రాజెక్టు
వరదనీటితో పరుగులిడుతున్న కృష్ణమ్మ
తెలంగాణలో రుతుపవనాలు ముఖం చాటేసినా ఎగువ కృష్ణా బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లలోకి వరదనీరు వచ్చి చేరుతుంది.
కృష్ణానది ఎగువన ఉన్న కర్ణాటక, పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల ప్రభావంతో కృష్ణమ్మ వరదనీటితో కళకళలాడుతోంది. కృష్ణానదీ ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో జలాశయాల్లోకి వరదనీరు చేరుతోంది. నారాయణపూర్, ఆల్మట్టి, శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి వరదనీరు వస్తోంది.వేసవిలో అడుగంటి డెడ్ స్టోరేజీకి చేరిన జలాశయాల్లోకి వరదనీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణలో రుతుపవనాలు ముఖం చాటేసినా కృష్ణా బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లలోకి వరదనీరు వచ్చి చేరుతుంది.
ఆల్మట్టి జలాశయంలోకి 71 క్యూసెక్కుల వరదనీరు వస్తుందని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. ఆల్మట్టి జలాశయంలో నీటి నిల్వ సామర్ధ్యం 130 టీఎంసీలు కాగా, ఇప్పటి71 టీఎంసీల నీరు చేరింది. వరదనీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఈ నీటిని నారాయణపూర్ జలాశయానికి వదులుతున్నారు. నారాయణ పూర్ జలాశయం 80 శాతం మేర నిండింది. దీంతో 75వేల క్యూసెక్కుల వరదనీటిని జూరాల ప్రాజెక్టుకు వదులుతున్నారు.జూరాల ప్రాజెక్టు జలాశయంలోకి 16,826 క్యూసెక్కుల నీరు వస్తుండగా 16,143 క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్థుతం 317.980 మీటర్లకు చేరింది. 9.66 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న జూరాల వరదనీటితో జలకళ సంతరించుకుంది.
శ్రీశైలంలోకి చేరుతున్న వరదనీరు
శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతుంది. శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.807టీఎంసీలు కాగా, 36 శాతం నిండిందని అధికారులు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా,ప్రస్థుతం 848.300 అడుగుల మేర నీరుంది. గత సంవత్సరం జూన్ 20వతేదీ నాటికి శ్రీశైలం నీటిమట్టం 814.600 గా ఉంది. గత సంవత్సరం జూన్ 20 వతేదీ నాటికి శ్రీశైలంలో 37.140 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఎగువన కురుస్తున్న వర్షాలతో గత సంవత్సరం కంటే రెట్టింపు అంటే 76.130 టీఎంసీలకు పెరిగింది.ఈసారి మాత్రం మే నెలలోనే శ్రీశైలంలో వరద కొనసాగుతోంది.
గత ఏడాది కంటే పెరిగిన సాగర్ నీటిమట్టం
నాగార్జునసాగర్ ప్రస్థుత నీటి మట్టం 514.300 అడుగులుగా ఉంది.గత సంవత్సరం సాగర్ జలాశయంలో 504.400 అడుగల మేరే నీరుంది.అంటే సాగర్ లో గత ఏడాది కంటే పది అడుగుల మేర నీరు పెరిగింది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590.000 అడుగులు కాగా, గత ఏడాది కంటే అధిక వరదనీరు జలాశయంలోకి చేరింది. గత ఏడాది రిజర్వాయరులో 122.350 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్థుతం ఎగువనుంచి వస్తున్న వరదనీటితో సాగర్ జలాశయంలో 1319 టీఎంసీల నీరుంది. 515 అడుగులుంది. సాగర్ జలాశయం నిండటానికి మరో 172 టీఎంసీల నీరు అవసరమని అధికారులు చెప్పారు. అక్కంపల్లి రిజర్వాయరులో ప్రస్థుత నీటి మట్టం 244.300 అడుగులు కాగా గత ఏడాది 242.600 అడుగులే ఉంది.
ఉస్మాన్ సాగర్ జలాశయం నీటిమట్టం జూన్ 20వతేదీ నాటికి గత ఏడాది 1780 .300 అడుగులుండగా, ఈ ఏడాది 1783.400 అడుగులకు పెరిగింది. అలాగే హిమాయత్ సాగర్ లోనూ గత ఏడాది కంటే జలాశయనీటిమట్టం పెరిగింది. సింగూరు జలాశయంలో కూడా అరు అడుగులకు పైగా నీరు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గత ఏడాది జలాశయ నీటి మట్టం 456.846 అడుగులు కాగా, ప్రస్థుతం 468.691 అడుగులకు పెరిగింది. వరదనీటితో కృస్ణమ్మ పరుగులీడుతుంటే గోదావరి ఎగువన వర్షాల్లేక స్వల్పంగా వరదనీరు వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఆశించిన మేర నీరు రాలేదు.
Next Story