సిగాచి ఫ్యాక్టరి  అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనం
x
Chemical Factory in Patancheru

సిగాచి ఫ్యాక్టరి అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనం

మంటలురేగి పేలుడు సంభవించినపుడు ఫ్యాక్టరీలో సుమారు 45 మంది తీవ్రంగా గాయపడ్డారు


హైదరాబాద్ పటాన్ చెరు పాశమైలారంలోని పారిశ్రామికవాడలోని సిగాచి రశాయన పరిశ్రమలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవదహనం అయ్యారు. సోమవారం ఉదయం కెమికల్ ఫ్యాక్టరిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం కెమికల్ ఫ్యాక్టరిలో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలీలేదు. మంటలురేగి పేలుడు సంభవించినపుడు ఫ్యాక్టరీలో సుమారు వందమందికి పైగా పనిచేస్తున్నట్లు సమాచారం. వీరిలో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20 మందిని ఫైర్ సిబ్బంది అతికష్టంమీద బయటకు తీసుకొచ్చారు. వీరందరిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఇంకా ఫ్యాక్టరీలో మరో 25 మంది ఉన్నారని సమాచారం. వీరందరినీ కాపాడేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కెమికల్ ఫ్యాక్టరిలోని మంటలు రేగటంతో రియాక్టర్ పేలిపోయింది. దాంతో మంటలు ఫ్యాక్టరి మొత్తం వ్యాపించాయి. పేలుడు ధాటికి పనిచేస్తున్న కార్మికుల్లో కొందరు 100 మీటర్ల దూరం ఎగిరిపడినట్లు సమాచారం. పేలుడు తీవ్రత, మంటల కారణంగా కొందరు మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే మరణాలను ఎవరూ ధృవీకరించలేదు. మంటల్లో చిక్కుక్కున్న వాళ్ళని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తుండగా ముందుజాగ్రత్తగా అంబులెన్సులను ప్రమాదస్ధలంలో ఉంచారు. మరిన్ని వివరాలు రావాల్సుంది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే కార్మికులకు చెందిన కుటుంబసభ్యులు అందరు ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు, ఫ్యాక్టరి యాజమాన్యం అక్కడే ఉండి పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.

Read More
Next Story