యతి నర్సింహానంద్ పై సీపీకి ఎంపీ అసద్ ఫిర్యాదు
x

యతి నర్సింహానంద్ పై సీపీకి ఎంపీ అసద్ ఫిర్యాదు

ముహమ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ఘజియాబాద్‌లోని దాస్నాదేవి ఆలయ పూజారి యతి నర్సింహానంద్‌పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు చేశారు.


ముహమ్మద్ ప్రవక్తపై ఘజియాబాద్‌లోని దాస్నాదేవి ఆలయ పూజారి యతి నర్సింహానంద్‌ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మజ్లిస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

గతంలోనూ యతి నర్సింహానంద్ అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టు అయి బెయిలుపై ఉన్నారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీపీకి సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెయిలుపై ఉండి, షరతులను ఉల్లంఘించి మళ్లీ వ్యాఖ్యలు చేశారని, అందుకే యతి నర్సింహానంద్ బెయిలును రద్దు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.

ముహమ్మద్ ప్రవక్తపై యతి నర్సింహానంద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం నుంచి తీసివేయాలని ఎంపీ కోరారు.యతి నర్సింహానంద్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ అబ్రార్ అహ్మద్ హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read More
Next Story