
ఎసిబికి చిక్కిన మరో అవినీతి చేప
బూర్గం పహాడ్ తహశీల్దార్ కార్యాలయంలోనే..
తెలంగాణ ఎసిబికి మరో అవినీతి చేప చిక్కింది. బూర్గం పహాడ్ తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న టైపిస్ట్ చిట్టెంశెట్టి నవక్రాంత్ ఫిర్యాదు దారుడి నుంచి రెండున్నర వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదు దారుడు ఎసిబికి సమాచారమిచ్చాడు.వెంటనే రంగంలో దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా నవక్రాంత్ ను పట్టుకున్నారు.
ఫిర్యాదు దారుడి బంధువు రేషన్ కార్డు దరఖాస్తును ఆన్ లైన్ పోర్టర్ లో అప్ లోడ్ చేయడానికి, కొత్త రేషన్ కార్డు జారీ చేయడానికి సంబంధిత అధికారులకు ముట్టజెప్పడానికి టైపిస్ట్ లంచం డిమాండ్ చేశాడు. రేషన్ కార్డులను ఇప్పించడానికి నవక్రాంత్ లంచం తీసుకునేవాడని ఎసిబి అధికారులు తెలిపారు. అవినీతి అధికారులకు చిక్కకుండా ఉండటానికి నవక్రాంత్ యుపిఏ చెల్లింపులు స్వీకరించేవాడు. ఎసిబి అధికారులు లంచంగా తీసుకున్న 2, 500 ను స్వాదీనం చేసుకున్నారు. నవక్రాంత్ ను ఎసిబి ప్రత్యేక కోర్టుకు అప్పగించారు.