‘కోటి మంది మహిళలను కోటీశ్వరులం చేసి తీరుతాం’
x

‘కోటి మంది మహిళలను కోటీశ్వరులం చేసి తీరుతాం’

తెలంగాణ అభివృద్ధికి మహిళా శక్తి తొలి ప్రాధాన్యమని, వారి సాధికారత కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని వివరించారు.


తెలంగాణలో మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని పునఃనిర్మించే పనిలో ఉందని, పదేళ్లుగా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, వాటిని తిరిగి గాడిలో పెట్టే పనిలో తమ ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి మహిళా శక్తి తొలి ప్రాధాన్యమని, వారి సాధికారత కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని వివరించారు.

మహిళా సాధికారతలో భాగంగానే తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉపాధి, విద్యార్థుల యూనిఫామ్‌లు తయారీని కూడా వారికే అందించామని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరుపైనే ఇస్తున్నామని చెప్పారు. ఈ విధంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు.

Read More
Next Story