పద్మశ్రీ అవార్డీ మొగులయ్యకు కేటీఆర్ హామీ..
x

పద్మశ్రీ అవార్డీ మొగులయ్యకు కేటీఆర్ హామీ..

ఇంటి సమస్య, కంటి చికిత్స చేయించే బాధ్యత తీసుకున్న కేటీఆర్.


పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు మాజీమంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆయనకు ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని చెప్పారు కేటీఆర్. ఇంటి స్థలం విషయంలో మొగులయ్యకు అవసరమైతే న్యాయమైరంగా కూడా సహాయం అందిస్తామని కేటీఆర్ వివరించారు. శనివారం.. కేటీఆర్‌ను ఆయన నివాసంలో మొగులయ్య కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్.. మొగులయ్య యోగక్షేమాల గురించి ఆరా తీశారు. తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని మొగులయ్య వివరించారు. ఆయన సమస్యల పరిష్కారించే బాధ్యతను కేటీఆర్ స్వీకరించారు. మొగులయ్య కంటికి ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స చేయించే బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు.

అయితే తనకు గత ప్రభుత్వం హిమయత్‌నగర్‌లో అందించిన 600 భూమి సమస్యల్లో ఉందని వివరించారు. ఆ స్థలం విషయంలో కొందరు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కలెక్టర్లను ఎన్ని సార్లు కలిసి లాభం లేకుండా పోయిందని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించిన కేటీఆర్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్యకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు. అలాగే, మొగులయ్య ఆ స్థలంలో కట్టుకున్న గదిని కూడా కొంతమంది కూల్చివేసిన పరిస్థితి ఉందని మొగులయ్య చెప్పారని పేర్కొన్నారు. మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు కేటీఆర్ సూచించారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Read More
Next Story