తెలంగాణ పోలింగ్ లైవ్ అప్డేట్స్
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికతో పాటు 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ సన్నద్ధం అయింది. ఈరోజే నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికతో పాటు 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పోలింగ్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
Live Updates
- 13 May 2024 3:10 AM GMT
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం ప్రతి ఓటరు బాధ్యత అని ఆయన తెలిపారు.
- 13 May 2024 3:04 AM GMT
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోయిన్పల్లిలోని సెయింట్ పీటర్ హైస్కూల్లో ఆయన ఓటు వేశారు.
- 13 May 2024 2:29 AM GMT
ఓటు వేసిన కిషన్ రెడ్డి
కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్లో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- 13 May 2024 12:24 AM GMT
తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. తెల్లవారుజామున అయిదు గంటల నుంచి ఆరున్నర గంటల దాకా మాక్ పోలింగ్ జరిపి అనంతరం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభిస్తామని పోలింగ్ కేంద్రం అధికారులు వెల్లడించారు.