కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి మెడికల్ కాలేజీలు నిదర్శనం
x

కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి మెడికల్ కాలేజీలు నిదర్శనం

యాభై ఏళ్లు ఇక్కడి ప్రజలకు సేవలందించిన చిట్టెం నర్సిరెడ్డి పేరు కాలేజీకి పెట్టడం సముచితం అని నేను భావిస్తున్నా అని రేవంత్ అన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నారాయణపేట జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.130 కోట్ల నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.26కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ అకాడమిక్ బ్లాక్‌లను ఆయన ప్రారంభించారు. అనంతరం నారాయణ పేటలో నిర్వహించిన “ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. మారుమూల పర్ాంతంలో ఒక మెడికల్, పారామెడికల్, నర్సింగ్కాలేజీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతలివ్వడానికి కేంద్రం తిరస్కరించిందని, కానీ తమ మంత్రులు, అధికారులు ఎంతో పోరాడి అనుమతులు తీసుకొచ్చారని చెప్పారు. ప్రజల విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ మెడికల్ కాలేజీ నిలువెత్తు నిదర్శనమని అన్నారు రేవంత్.

‘‘కాలేజీలో పూర్తి స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. నిజమైన పేదవాడికి సంక్షేమం చేరినప్పుడే అభివృద్ధి జరిగినట్లు అని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మీ అవసరాలపై అవగాహన ఉన్నవారే మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పేదలకు విద్య అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. డాక్టర్ వృత్తి ఒక ఉద్యోగం కాదు… ఒక బాధ్యత. మీరంతా గొప్ప డాక్టర్లుగా రాణిస్తే రాష్ట్రానికి మంచి సేవలు అందించగలరు’’ అని విద్యార్థులను ప్రోత్సహించారు. యాభై ఏళ్లు ఇక్కడి ప్రజలకు సేవలందించిన చిట్టెం నర్సిరెడ్డి పేరు ఈ కాలేజీకి పెట్టడం సముచితం అని నేను భావిస్తున్నా. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మా అధికారులకు సూచిస్తున్నా అని తెలిపారు.

అయితే నారాయణపేట పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.5.58 కోట్లతో నిర్మించిన ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. రూ.1.23 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వమించే పెట్రోల్ బంక్‌ను, రూ.7కోట్లతో మరికల్ మండల పరిషత్ ఆఫీసు కాంప్లెక్స్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్బంగానే మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యసేవలను అందిస్తామని, మెడికల్ కాలేజీకి నిధుల లోటు రానివ్వమని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను పుష్కలంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. వైద్య వృత్తి అనేది ఉద్యోగం కాదని, అదో బాధ్యత అని, వైద్యసేవ అనేది మానవత్వంతో నిర్వర్తించాల్సిన బాధ్యత అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story