నాయుడు డిపెండెంట్ అలైన్స్ అంటూ రేవంత్ సెటైర్లు
x

నాయుడు డిపెండెంట్ అలైన్స్ అంటూ రేవంత్ సెటైర్లు

నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ మీద వివక్ష చూపినందుకు నిరసనగా ఒక తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీని కోరారు.


ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (మంగళవారం) ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ మీద వివక్ష చూపినందుకు నిరసనగా ఒక తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీని కోరారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుకు సూచనలిచ్చారు. ఈ తీర్మానానికి సహకరించాలని ఆయన బీఆర్ ఎస్, ఎంఐఎం తదితర పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వికసిత్ భారత్ 2047 బడ్జెట్ లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. మొత్తం బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని మండిపడ్డారు. ఏపీకి, బీహార్ కి బడ్జెట్ కేటాయించడంపైనా ఆయన సెటైర్లు వేశారు. NDA అంటే నాయుడు, నితీష్ డిపెండెంట్ అలయన్స్ అని విమర్శించారు.

ఇంకా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

స్వయంగా నేనే మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరా

వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు ఉండాలని, అభివృద్ధికి సహకరించాలని కోరాం.

రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పాం..

వివక్షను తొలగించి నిధులు కేటాయించాలని కోరాం

మొత్తం బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు.

తెలంగాణ అనే పదాన్ని పలకడానికే కేంద్రం ఇష్టపడటంలేదు.

వారి మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదు.

పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి కేంద్రం నిధులు కేటాయించింది.

మరి పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు?

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, రీజనల్ రింగ్ రోడ్డుకు... ఏ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించలేదు.

ఐటీఐఆర్ గురించి ప్రస్తావించలేదు.

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారు

వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారు.

ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. ఇది కుర్చీ బచావో బడ్జెట్...

బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదు.

ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదు.

బీజేపీ కి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు మాత్రమే కావాలి.. కానీ అభివృద్ధి పట్టదా?

బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి, బాధ్యత వహించాలి.

కేంద్ర వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి రాజీనామా చేసి బయటకు రావాలి.

తెలంగాణకు ఐఐఎం ఇవ్వం అని కేంద్రం చెప్పినా... కిషన్ రెడ్డి ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలి?

ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే... ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.

కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చారు.

తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది.

విభజన చట్టం కేవలం ఏపీకి మాత్రమే కాదు.. తెలంగాణకూ వర్తిస్తుంది...

బడ్జెట్ ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి.

లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే..

కిషన్ రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది.

మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దు.

పోలవరంకు నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు నిధులు ఇవ్వరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

పార్లమెంట్ లో నిరసనకు బీజేపీ ఎంపీలూ కలిసి రావాలి.

తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది..

ఇది ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాం..

Read More
Next Story