రెండో రోజు ముగిసిన ప్రభాకర్ రావు విచారణ
x

రెండో రోజు ముగిసిన ప్రభాకర్ రావు విచారణ

మళ్ళీ 14న విచారణకు రావాలని చెప్పిన సిట్ అధికారులు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు విచారణ రెండో రోజు ముగిసింది. ఇందులో కూడా సిట్ అధికారులు ఆశించిన సమాధానాలు రాలేదు. కాగా ఈ నెల 14న మళ్ళీ విచారణకు రావాలని సిట్ అధికారులు చెప్పారు. సిట్ విచారణలో ప్రభాకర్ రావు చాలా స్మార్ట్‌గా సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

మావోయిస్టులకు డబ్బులు పంపించారాని ఎందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని అడిగితే మౌనమే సమాధానంగా ఉన్న ప్రభాకర్ రావు. విచారణ అధికారులకు అంతు చిక్కకుండా జవాబులను చెప్పిన ప్రభాకర్ రావు. ఏ ప్రశ్న అడిగినా మరిచిపోయాను, గుర్తులేదు, అలా చేయడం చట్ట విరుద్ధం", అంటూ పదాలను ఉపయోగిస్తు విచారణను దాట వేసిన ప్రభాకర్ రావు. ట్యాపింగ్ కోసం కొందరి పేర్లను తప్పుగా మార్చి వారిని మావోయిస్టు సానుభూతి పరులుగా ఎందుకు చూపించారాని పత్రాలను ముందు పెట్టినప్పుడు మౌనం గా ఉంటున్న అధికారి. మరికొందరిని మావోయిస్టు లకు డబ్బులు పంపారని చిత్రీకరించి ఫోన్ ట్యాపింగ్ కు ఎందుకు పాల్పడ్డారని అడిగితె మీరు పోలీస్ ఆఫీసర్స్ కదా మీకు తెలియదా అంటూ ఎదురు ప్రశ్నలు. హై - ప్రొఫైల్ విఐపి ల కాల్ డాటా ఎందుకు తీశారు అని అడిగితే అది చేయడం తప్పు, అది ఎవరు చేసారో నాకు తెలియదని ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు కొన్ని విషయాల పై తప్పు ఒప్పుకుంటుండం విచారణ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

15 నెలలు పోలీసులు జరిపిన దర్యాప్తు, విచారణ పై పూర్తి అవపోసన పుట్టిన ప్రభాకర్ రావు. విచారణ సమయంలో కలవరానికి, గందరగోళం కు గురి కాకుండా ప్రశ్నలకు ఆన్సర్లు ఎలా ఇవ్వాలో ముందస్తుగా ప్రిపేర్ అయ్యారు. ప్రభాకర్ రావు విచారణ జరుగుతుండగా పోలీసులు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో కీలకంగా వ్యవహరించిన మరో నిందితుడు ప్రణీత్ రావు ను పోలీసులు రెండు రోజుల నుంచి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు పిలిపించి అతనిని మరోసారి విచారించారు.. ప్రభాకర్ రావు చెప్తున్న కొన్ని విషయాల పై ఆరా తీసుతున్నారు.

Read More
Next Story