
ఆఫ్రికన్ నత్తల నివారణకు స్ప్రేయింగ్ ఆపరేషన్ షురూ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని న్యూ బోయిన్ పల్లి హరిత వనంలో ఆఫ్రికన్ నత్తల బెడదతో జనం ఆందోళన
హైదరాబాద్ నగర శివార్లలోని సికింద్రాబాద్ కంటోన్మెంటు పరిధిలోని ఆర్మీ ఏరియాలో ఆఫ్రికన్ నత్తల నివారణకు కంటోన్మెంటు బోర్డు ఆరోగ్య, పారిశుధ్య విభాగం అధికారులు గురువారం స్ప్రేయింగ్ ఆపరేషన్ చేపట్టారు. సికింద్రాబాద్ ఆరోగ్య, పారిశుధ్య విభాగం సూపరింటెండెంట్ ఎం దేవేందర్ ఆధ్వర్యంలో పది మంది కార్మికులతో నత్తల నివారణకు ఉప్పునీరు, క్లోరిన్ తో కూడిన బ్లీచింగ్ పౌండరు కలిపిన రసాయనాన్ని తాము పిచికారి చేశామని, దీని వల్ల ఆఫ్రికన్ నత్తలు మరణిస్తున్నాయని కంటోన్మెంట్ శానిటరీ ఇన్ స్పెక్టర్ అశుతోష్ చౌహాన్ గురువారం మధ్యాహ్నం ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినికి ధికి చెప్పారు. మరో మూడు రోజులపాటు ఆఫ్రికన్ నత్తల నివారణకు స్ప్రేయింగ్ ఆపరేషన్ కొనసాగిస్తామని ఆయన తెలిపారు. న్యూ బోయిన్ పల్లిలోని మేడ్చల్ రోడ్డు పక్కన ఉన్న ఆర్మీ ఏరియాలో చెట్లపై ఆఫ్రికన్ నత్తలు కనిపించడంతో దీన్ని నివారణకు రసాయనాన్ని పిచికారి చేశామన్నారు. ఈ నత్తలు కంటోన్మెంట్ ప్రాంతంతోపాటు చుట్టూపక్కల వ్యాప్తి చెందకుండా నివారించేందుకు రసాయనాన్ని పిచికారి చేస్తున్నామని చౌహాన్ వివరించారు.
ఆఫ్రికన్ నత్తలు
ఆఫ్రికన్ నత్తలు ఎందుకు వచ్చాయంటే...
ఆర్మీ హరిత వనంలో రసాయనం పిచికారి చేస్తున్న కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది
పచ్చని చెట్లను తినేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

