యోగా డే ఈవెంట్‌లో తొక్కిసలాట..
x

యోగా డే ఈవెంట్‌లో తొక్కిసలాట..

భద్రతా ఏర్పాట్ల లోపం వల్లే ఈ ఘటన జరిగిందా?


ప్రపంచ యోగా దినోత్సవాన్ని భారత్ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ సర్కార్.. గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భారీ సంఖ్యలో ఔత్సాహికులు హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ యువతి స్పృహ కోల్పోయింది. ఆమెను అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యోగా కార్యక్రమంలో తొక్కిసలాట జరగడం ప్రస్తుతం కీలకంగా మారింది. ఏర్పాట్లలో లోపమా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే అసలు ఈ తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే.. అల్పాహారం దగ్గర. గేట్ నెం.2 దగ్గర నిర్వాహకులు అల్పాహారం పంపిణీ పెట్టారు. అక్కడకు యోగా చేయడానికి వచ్చినవారు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే తొక్కిసలాట జరిగేటంత ఉధృతి ఎందుకు వచ్చిందో? అన్న అంశం ఇంకా తెలియరాలేదు. అసలు వారు అక్కడికి యోగా చేయడానికి వచ్చారా? బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వచ్చారా? అని కూడా కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అల్పాహారం దగ్గర అసలు అంత రద్దీ వస్తుంటే.. సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ సరిచేసే ప్రయత్నం చేయలేదా? భద్రతా ఏర్పాట్ల లోపం వల్లే ఈ ఘటన జరిగిందా? అని కూడా మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఒక యువతి స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆమె గాంధీ మెడికల్ కాలేజీ నర్సింగ్ విద్యార్థిని అని అధికారులు గుర్తించారు.

Read More
Next Story