మాజీ స్పీకర్  మధుసూదనాచారిపై  సుమోటో కేసు
x

మాజీ స్పీకర్ మధుసూదనాచారిపై సుమోటో కేసు

పోలీసు విధులకు ఆటంకం కలిగించారని..


బిఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్ గా పని చేసిన మాజీ స్పీకర్ పై సుమోటో కేసు నమోదైంది. ఒక టీవీ చానల్ పై దాడిచేసిన కేసులో బిఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసుకుని గెల్లు శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడానికి తెలంగాణ భవన్ వెళ్లారు. అక్కడ పోలీసులను మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ బాల్కసుమన్ అడ్డుకున్నారు. దీంతో వారిపై సుమోటో కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై పోలీసులు వీరిపై సుమోటో కేసు నమోదుచేశారు.

శనివారం ఒక టీవీ చానల్ పై బిఆర్ఎస్ నేతలు దాడి చేసి ఆస్తి నష్టం కలిగించారు. బిఆర్ ఎస్ నేతలను కించపరిచే విధంగా ప్రసారం చేస్తున్నట్లు బిఆర్ఎస్ నేతలు ఈ దాడులకు పాల్పడ్డారు.

Read More
Next Story