
కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు
కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలకు గానూ వివరణ కోరిన అత్యున్నత న్యాయస్థానం.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్లలో మూసీ ప్రక్షాళన ఒకటి. కానీ మూసీ ప్రక్షాళన అనేదంతా ఒక స్కామ్ అని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విమర్శలు గుప్పించారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 కోట్ల కుంభకోణం చేస్తోందని, మూటలను ఢిల్లీకి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగానే.. తన సమాధానం చెప్పాలంటూ కేటీఆర్కు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం విచారించింది.
అయితే కేటీఆర్ ఆరోపణలపై సుగుణమ్మ తొలుత ఉట్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన చేసును కొట్టివేయాలంటూ కేటీఆర్.. హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కేసును క్వాష్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుగుణమ్మ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది.