
స్థానిక సంస్థలపై తెలంగాణ బిజెపి ఫోకస్
ఈ నెల 25న విస్తృత స్థాయి సభలు, సమావేశాలు
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై బిజెపి దృష్టి పెట్టింది. కాంగ్రెస్, బిజెపి విధానాలను ఎండగడుతూ బిజెపి శుక్రవారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. బిజెపి కేంద్ర పరిశీలకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిజెపి నిర్వహించిన మొట్టమొదటి సమావేశం ఇది. కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 25న బిజెపి అన్ని జిల్లాలలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయనుందని కిషన్ రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హత్య చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి బిజెపి ఆందోళన బాట పట్టిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.వచ్చే బుధవారం ఈ సభలు, సమావేశాలకు గ్రామీణ ప్రాంత యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ , బిఆర్ఎస్ లను ఓడించాలన్నారు.
హైద్రాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే , ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క గ్యారెంటీని అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. బిజెపి, కాంగ్రెస్ దొందు దొందేనన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే, మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజల అభ్యున్నతికి కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, నరేంద్రమోడీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది చెందుతుందని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హత్య చేస్తుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి సునీల్ బన్సల్, తెలంగాణ బిజెపి నేతలు డికె అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు