రు.60,799 వేల కోట్లతో రాష్ట్రంలో భారీగా రహదారుల నిర్మాణం
x

రు.60,799 వేల కోట్లతో రాష్ట్రంలో భారీగా రహదారుల నిర్మాణం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రోడ్లకు ఇంత భారీగా నిధులు కేటాయించడం మొదటి సారి


రు. 60,799 వేల కోట్లతో తెలంగాణలో రహదారుల నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమయింది. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రికార్డు.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ భారీ మౌలిక సదుపాయాల కల్పనతో బహుళ జాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారుతుంద, దీని వల్ల లక్షలాదిమంది గ్రామీణ యువతకు ఉపాధి కలగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణలో రహదారుల విస్తరణ ఇలా ఉంటుంది

*రు.10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ హైవేను ఎనిమిది లైన్లుగా విస్తరణ.

*తెలంగాణకు ప్రతిష్టాత్మకమయిన రీజినల్ రింగ్ రోడ్ (RRR) రహదారి నిర్మాణానికి 36,000 వేల కోట్లు

*రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం. సింగిల్ రోడ్డు ఉన్నచోట డబుల్ రోడ్ల నిర్మాణం.HAM ప్రాజెక్టుకు 11,399 కోట్లు.. కొద్ది రోజుల్లో టెండర్లు పిలుస్తున్నాం

వీటితోపాటు ప్రపంచంలోని పెట్టుబడిదారులు భారీగా తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చేలా మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రహదారుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రానున్నాయి. ఫలితంగా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాదిమంది రాష్ట్ర యువతకు ఉపాధి లభించనుంది.

*రు. 8,000 వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్.

తెలంగాణ లో వస్తున్న మరొక ప్రతిష్టాత్మకమయిన ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే. రు.20 వేల కోట్లతో ఈ రహదారి నిర్మాణం జరుగుతుంది.

ఈ రీతిలో రహదారుల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. తన రాజకీయ జీవితంలో ఈ ప్రాజక్టు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిందని ఆయన చెప్పారు.

Read More
Next Story