తెలంగాణ గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ల నియామకం..
x

తెలంగాణ గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ల నియామకం..

తెలంగాణలోని గ్రంథాలయ సంస్థల చైర్మన్ల నియామకంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది.


తెలంగాణలోని గ్రంథాలయ సంస్థల చైర్మన్ల నియామకంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. పలు జిల్లాల్లో వీరి కొరత ఉందని, అందులో ఆయా జిల్లాలో గ్రంథాలయ ఛైర్మన్ల నియామకాలకు చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల గ్రంథాయల సంస్థలకు ఛైర్మన్ల నియామకాలకు ఈరోజు పూర్తి చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కొంత కాలంగా ఈ పదవుల నియామకం దృష్టి సారించామని, నేటితో వీటిని ముగించామని సర్కార్ చెప్పింది. ఈరోజు 13 జిల్లాల గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది.

• నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీ

• సిరిసిల్ల- నాగుల సత్యనారాయణ గౌడ్

• కరీంనగర్- సత్తు మల్లయ్య

• రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్ రెడ్డి

• వనపర్తి - జి. గోవర్ధన్

• సంగారెడ్డి- గొల్ల అంజయ్య

• కామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి

• మెదక్- సుహాసిని రెడ్డి

• నారాయణ్్పట్ వరాల విజయ్ కుమార్

• నాగర్ కర్నూల్ - జి. రాజేందర్

• వికారాబాద్- శేరి రాజేశ్ రెడ్డి

• మహబూబ్నగర్- మల్లు నరసింహారెడ్డి

• జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు

Read More
Next Story