
టీజీ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ర్యాంకర్స్ వీళ్లే
ఈ ర్యాంకు ఆధారంగానే బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు.
టీజీ ఈసెట్ ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డి వీటిని రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను మొత్తం 18 వేల 998 మంది పరీక్షలు రాశారు.
టీజీఈసెట్ ర్యాంకర్లు వీళ్లే..
బిఎస్సి మ్యాథ్స్ లో మొదటి ర్యాంక్ సంతోష్ కుమార్,
కెమికల్ ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంక్ లెంక తేజ సాయి,
సివిల్ ఇంజినీరింగ్ లో గోల్కొండ నిఖిల్ కౌశిక్,
కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ లో శ్రీకాంత్,
ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ మొదటి ర్యాంక్ కట్లే రేవతి,
ఎలెక్ట్రికల్ , ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంక్ కాసుల శ్రావణి..
ఎలెక్ట్రానిక్స్ ,ఇన్స్ట్రునెంటేషన్ ఇంజినీరింగ్ లో రాపర్తి చందన,
మెకానికల్ ఇంజినీరింగ్ లో పోతూ గంటి కార్తిక్,
మెటలర్జికల్ ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంక్ తోట సుబ్రహ్మణ్యం..
మైనింగ్ ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంక్ కుర్మా అక్షయ
ఫార్మసీ లో మొదటి ర్యాంక్ ఐలి చందన.