
గవర్నర్ చెంతకు.. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్
పంచాయతీ రాజ్ శాఖ ఈ ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత మంత్రి, సీఎం ఆమోదంతో ప్రభుత్వం రాజ్భవన్కు ముసాయిదాగా పంపించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ చెంతకు చేరింది. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణల ఆమోదం కోసం ముసాయిదాను ప్రభుత్వం గవర్నర్కు పంపింది. పంచాయతీరాజ్ చట్టంలో 2018లోని సెక్షన్ 285 క్లాజ్-ఎ ను సవరించాలని రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల నిర్ణయించింది. ఈ సెక్షన్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతానికి అధిగమించకుండా అమలవుతాయని, దీనిని సవరించడం ద్వారా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే సదరు సెక్షన్లో 50శాతానికి మించకుండా అనే వాక్యాన్ని సవరించాలని డిసైడ్ అయింది.
పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లను కల్పించడాలని సర్కార్ భావించింది. పంచాయతీ రాజ్ శాఖ ఈ ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత మంత్రి, సీఎం ఆమోదంతో ప్రభుత్వం రాజ్భవన్కు ముసాయిదాగా పంపించింది. గవర్నర్ ఆమోదం పొందితే చట్టసవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గడువు విధించింది.