
జాతీయ వేదికపై మెరిసిన తెలంగాణ, రాష్ట్రపతి అవార్డులు
గిరిజన సాధికారత కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మెరిసింది.
దేశంలోనే గిరిజన సాధికారత కార్యక్రమాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ లో తెలంగాణ మూడవ స్థానాన్ని పొందింది.(Telangana Shines) ఈ అద్భుత విజయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఢిల్లీలో అందుకున్నారు. దీంతోపాటు తెలంగాణలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన,శిక్షణ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మ పి.వి., అసాధారణ కృషికి సూపర్ కోచ్లు, రాష్ట్ర మాస్టర్ ట్రైనర్లలో గుర్తింపు పొందారు.
తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా యువ శాస్త్రవేత్త అవార్డు పొందిన డాక్టర్ నిరజ
ఐదు జిల్లాల కలెక్టర్లకు జాతీయ అవార్డులు
🌟 A Proud Moment for the Gurukulam🌟
— Jacob Ross (@JacobBhoompag) October 17, 2025
Under the visionary and dynamic leadership of Hon’ble Chief Minister Shri A. @revanth_anumula 🚀, Telangana continues to shine with remarkable achievements across every sector. Reflecting this vision, the Gurukulam Institutions 🏫 are… pic.twitter.com/UXoJ67dAoX
తెలంగాణ గురుకులాలకు గర్వకారణం డాక్టర్ నీరజ సిన్హా
పాఠశాలల విద్యార్థులకు పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం
తెలంగాణలో నర్సరీ నుంచి 4వతరగతి వరకు చదివే పాఠశాలల విద్యార్థులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2026వ సంవత్సరం నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద నాలుగు పాఠశాలల్లో ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.ప్రతీ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలగా అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.