
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి అంతా సిద్ధం
వరుస సమీక్షల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమయింది. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. డిసెంబర్ 8,9 తేదీల్లో ఈ సమ్మిట్ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఇందులో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరకానున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు పనులను రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివిధ విభాగాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కు తుది మెరుగులు దిద్దుతారు. ఈరోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరుసగా ఈ సమీక్ష సమావేశాలు జరుగుతాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు వరుసగా జరిగే అన్ని సమావేశాల్లో పాల్గొంటారు. ఆయా విభాగాల సమీక్షలో సంబంధిత మంత్రులు పాల్గొంటారు.
మంగళవారం నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో ఈ అంశాలపై వరుస సమావేశాలను నిర్వహిస్తూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, 2047 నాటికి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంపై తుదిమెరుగులు దిద్దనున్నారు.
సమీక్షల వివారాలివే...
నవంబర్ 25- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహణ ఏర్పాట్లు
సీఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, ఆయా విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొంటారు.
నవంబర్ 26 – లాజిస్టిక్స్, ఏర్పాట్లు
సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు సంబంధిత అధికారులు.
నవంబర్ 27 – మౌలిక వసతులు, అభివృద్ధి
సీఎంతో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సంబంధిత విభాగాల అధికారులు.
నవంబర్ 28 – విద్య, యువజన సంక్షేమం
సాయంత్రం 4 గంటలకు సీఎంతో పాటు మంత్రులు వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, సంబంధిత విభాగాల అధికారులు .
సాయంత్రం 6 గంటలకు: టూరిజం, టెంపుల్ టూరిజంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ సంబంధిత అధికారులు
నవంబర్ 29 – వ్యవసాయం, సంక్షేమ విభాగాలు
సాయంత్రం 4 గంటలకు: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్ రెడ్డి, వాకాటి శ్రీహరి సంబంధిత అధికారులు.
సాయంత్రం 6 గంటలకు: మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , సీతక్క , మోహమ్మద్ అజరుద్దీన్.
నవంబర్ 30 – ఆరోగ్య రంగం
సీఎంతో పాటు మంత్రి దామోదర్ రాజనరసింహ సంబంధిత అధికారులు

