అమెరికాలో అడుగుపెట్టిన రేవంత్
x

అమెరికాలో అడుగుపెట్టిన రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం ఆయన 12 రోజుల అమెరికా, దక్షిణ కొరియా లలో పర్యటించనున్నారు.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం ఆయన 12 రోజుల అమెరికా, దక్షిణ కొరియా లలో పర్యటించనున్నారు. శనివారం తెల్లవారుజామున అమెరికాకు బయలుదేరి వెళ్లిన ఆయన కొన్ని గంటల క్రితం న్యూయార్క్ చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు రేవంత్ కి ఘనస్వాగతం పలికారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరోవైపు 4న మంత్రి శ్రీధర్ బాబు, 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతారు. వీరు అక్కడ రేవంత్ టీమ్ తో జాయిన్ అవుతారు.

గత ఏడాది డిసెంబర్‌ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి, జనవరిలో స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మరోసారి విదేశీ పర్యటనకి వెళ్లారు రేవంత్ రెడ్డి. తిరిగి ఆగస్టు 14న ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. 9వ తారీకు వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. 10వ తేదీన అమెరికా నుంచి బయలుదేరి సియోల్ చేరుకుంటారు. ఈ పర్యటనలలో పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో కంపెనీల అధిపతులతో సీఎం నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది.

సీఎం ఫారెన్ టూర్ షెడ్యూల్ ఇదే...

3న హైదరాబాద్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకుంటారు.

4న న్యూజెర్సీలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.

5న న్యూయార్క్ లో కాగ్నిజెంట్ సీఈవోతో, సిగ్నా సీనియర్ అధికారి, ఆర్సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్ సంస్థల ప్రతినిధులు, ఆర్గా సీఈవో రామకృష్ణ, పీ అండ్ వో సంస్థ సీవోవో శైలేష్ జెజురికర్, ర్యాపిడ్ 7 ప్రతినిధులతో భేటీ అవుతారు.

6న పెప్సికో, హెచ్సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్ కు వెళ్తారు.

7న చార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శన, ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటాయి.

8న కాలిపోర్నియాలో ట్రినెట్ సీఈవో, ఆరమ్, ఆమ్ జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం, సెలెక్ట్ టెక్ యూనికార్న్స్ ప్రతినిధులతో ఇష్టాగోష్టి, సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.

9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ, స్టాన్ ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ సందర్శన, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈవో, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలుస్తారు.

10న అమెరికా నుంచి బయలుదేరి 11న సియోల్ చేరుకుంటారు.

12న సియోల్ లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ అఫ్ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ, ఎల్ఎస్ హోల్డింగ్స్, హ్యుండయ్ మోటార్స్ ప్రతినిధులతో, పలువురు ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు.

13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్స్ భేటీ, కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం, సామ్సంగ్, ఎల్కీ సంస్థల ప్రతినిధులతో చర్చలు, హాన్ రివర్ ఫ్రంట్ సందర్శన ఉంటాయి.

14న హైదరాబాద్ చేరుకుంటారు.

Read More
Next Story