
గ్రూప్-2 ఫలితాలు వచ్చేశాయ్..
782 మంది జాబితాను వెల్లడించిన టీజీపీఎస్సీ.
తెలంగాణ గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకు ఈ పరీక్ష జరగింది. వీటికి ఎంపికైన 782 మంది జాబితాను ఆదివారం ప్రకటించింది టీజీపీఎస్సీ. ఒక్క పోస్టు ఫలితాన్ని పెండింగ్లో పెట్టింది. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ.. 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల జాబితాను వెల్లడించింది. ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది.
Next Story