
తెలంగాణలో అమిత్ షా షెడ్యూల్ ఇదే
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించబోతున్నారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించబోతున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఉదయం 11.25కి బయలుదేరుతున్న అమిత్ షా(Amit shah) మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్(Hyderabad), బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం లాంజ్ లోనే సుమారు 45 నిముషాలు బీజేపీ కేంద్రమంత్రులు జీ. కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay), ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు పార్టీ తెలంగాణ ఇన్చార్జిలతో ప్రత్యేకంగా సమవేశమవుతారు.
అక్కడే భోజనంచేసి నిజామాబాద్ కలెక్టరేట్ కు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరుతారు. నిజామాబాద్ పట్టణం వినాయక్ నగర్ లో ఏర్పాటుచేసిన జాతీయ పసుపు బోర్డు ఆఫీసును 2 గంటలకు ప్రారంభిస్తారు. పసుపు బోర్డు ఆఫీసులోనే సుమారు అర్ధగంటపాటు ఉంటారు. తర్వాత నిజామాబాద్ కంటేశ్వర్ క్రాస్ రోడ్డులో ఏర్పాటుచేసిన ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ధర్మపురి శ్రీనివాస్ అంటే కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) తండ్రి. తర్వాత పట్టణంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్స్ లో జరగబోయే కిసాన్ మహాసభలో పాల్గొంటారు. సుమారు 1.15 గంటలు బహిరంగసభలోనే అమిత్ షా ఉంటారు. తర్వాత అక్కడినుండి మళ్ళీ బేగంపేట విమానాశ్రయంకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.