Mahesh Kumar Goud
x

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు మహేష్ హాజరు..

తన ఫోన్‌ను ట్యాప్‌ చేసిందని గతంలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు.


ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావును మూడు రోజులు విచారించిన సిట్.. తాజాగా మంగళవారం నాలుగో రోజు కూడా విచారిస్తోంది. ఈ నాలుగో రోజు విచారణలో ఈ కేసులోని ప్రధాన నిందితులు నలుగురిని ఏకకాలంలో విచారిస్తోంది. అయితే ఈ విచారణలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా, సాక్షిగా ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. 2023 నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నందున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్‌ చేసిందని గతంలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో విచారణకు ఆయన హాజరయ్యారు.

Read More
Next Story