మధ్య ప్రదేశ్ లో ఇద్దరు యువతుల విక్రయం
x

మధ్య ప్రదేశ్ లో ఇద్దరు యువతుల విక్రయం

తొమ్మిది మంది అరెస్ట్


మానవ అక్రమ రవాణా అనేది చట్ట విరుద్దం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. కానీ మధ్య ప్రదేశ్ లో ఇద్దరు యువతులను కొందరు విక్రయించేశారు. ఈ నేరంతో సంబంధమున్న 9 మందిని అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను గంప గుత్తగా అమ్మేశారు. ఒక మహిళను లక్ష 30 వేలకు విక్రయిస్తే మరో మహిళను లక్షా 10వేలకు విక్రయించేశారు.

ఇప్పటి వరకు భ్రూణ హత్యలు పెరగడం వల్ల దేశంలో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గాయి. తాజాగా యువతుల విక్రయాలు సభ్య సమాజాన్ని ఇప్పుడు కలవర పరుస్తోంది. సంతలో వెళ్లి మేకలను కొనుగోలు చేసినట్టు మధ్య ప్రదేశ్ లో యువతులను కొనుగోలు చేసిన వార్త దేశ వ్యాప్తంగా సంచలనమైంది.

మధ్య ప్రదేశ్ లో యువతులను అమ్మిన వార్తలను ఇంతవరకు చూడలేదు. వినలేదు. అత్యాచారాలు, హత్యలు, దాడులు జరగడం అక్కడ కామన్. గతంలో రేవా జిల్లాలో ఇద్దరు మహిళను మట్టిలో పాతిపెట్టడానికి ప్రయత్నించిన కొందరు పోలీసులకు పట్టుబడ్డారు.

దాడిచా అనే పద్దతిలో స్త్రీలను అద్దెకు తీసుకుని అమ్మడం మధ్య ప్రదేశ్ లో ఆచారంగా వస్తుంది.

భారత దేశంలో మహిళలు అనేక సంస్కరణలకు నాంది పలికారు. ప్రాచీన కాలంలో మహిళలకు గౌరవం ఎక్కువగా ఉండేది. ఎక్కడ మహిళలు పూజింపడబతారో అక్కడ దైవత్వం కనిపిస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపడరో అక్కడ సత్కర్మలకు విలుద ఉండదని భారతీయ సంస్కృతి తెలియజే స్తుంది. మహిళలను త్రి శక్తి రూపంగా చూస్తాం. ప్రకృతిలో ఒక భాగంగా భావిస్తాం. ఆది శక్తి, పరాశక్తిగా స్త్రీని పూజిస్తాం. భారతీయ సాంప్రదాయం కూడా అదే నేర్పింది. వేద కాలం నుంచి ఆధుని యుగం వరకు మహిళలను గౌరవించడం అనాదిగా వస్తోంది.

కానీ మధ్య ప్రదేశ్ లో ఇద్దరు యువతుల విక్రయం బాధిత మహిళల బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వరకు వెలుగులోకి రాలేదు. యువతుల విక్రయాలు జరిగినట్టు పోలీసులు అంగీకరించారు. డిఎస్పీ రామానుజన్ తో పాటు స్థానిక ఇన్ స్పెక్టర్ రవీందర్ , ఎస్ ఐ ప్రశాంత్ యువతుల విక్రయాల వివరాలను మీడియాకు చెప్పారు.

అమ్ముడు పోయిన ఈ యువతులు సంవత్సరం నుంచి కనబడలం లేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వడి గొండి విలేజ్ కు చెందిన ఈ ఇద్దరు యువతులను సంవత్సరం నుంచి తల్లిదండ్రులు వెతుకుతున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఇద్దరు యువతుల మీద వాళ్లు ఆశలు వదులుకున్నారు.

అయితే బాధిత యువతుల్లో ఒకరి ఆధార్ కార్డు పోస్ట్ లో రావడంతో తల్లిదండ్రులకు ఆశలు చిగురించాయి. ఆ ఆధార్ కార్డు పూర్తిగా అప్ డేట్ అయ్యింది. అందులోఒక ఫోన్ నెంబర్ దొరికింది. ఈ ఫోన్ నెంబరే నిందితులను పోలీసులకు పట్టిచ్చింది. ఆధార్ కార్డు మీద ఉన్న ఫోన్ నెంబర్ కు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే అది మధ్య ప్రదేశ్ కు వెళ్లింది. పోలీసులకు కంప్లయింట్ చేయగానే కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైంది.

అనుమానితులను అదుపులో తీసుకున్నారు. వారిని తమ స్టైల్ లో విచారణ జరిపారు. విషయం బయటకొచ్చేసింది. ఈ నేరంలో మొత్తం తొమ్మిదిమంది ఇన్వాల్వ్ అయ్యారు. ప్రధాన నిందితురాలైన పరికి పండ్ల విజయ లక్ష్మి ని పోలీసులు తమ దైన శైలి మ లో విచారణ చేస్తే యువతుల విక్రయాలు జరిగినట్టు అంగీకరించింది.

పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి కాని, ఒంటరిగా ఉన్న యువతులే ఈ గ్యాంగ్ టార్గెట్ . యువతుల భర్తలు చనిపోతే కూడా ఈ గ్యాంగ్ విక్రయాలు చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పేదరికంలో ఉన్న యువతులకు డబ్బు ఆశ చూపి లో బర్చుకుంటున్నారు.

Read More
Next Story