
కేసీఆర్కు సిట్ నోటీసులు? కీలక ప్రశ్నలు సంధించిన బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు నోటీసులివ్వాలని సిట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన బండి సంజయ్.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని తెలుపుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. కాగా ఈ నిర్ణయాన్ని కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ స్వాగతించారు. కానీ సిట్పై కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ఆన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడం మంచి పరిణామమన్నారు. ఈ కేసులో అసలు సూత్రధారులను బయట పెట్టాల్సిన అవసరం ఉందని ్యాఖ్యానించారు.
‘‘ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాను. నాతో సహా ఎంతోమంది నేతల ఫోన్లను ట్యాప్ చేయించడమే కాకుండా, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టి, ఆఖరికి కన్నబిడ్డ, అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేయించి, ఎంతో పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకొని, బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల నుండి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిపైనా సమగ్రంగా దర్యాప్తు చేయాలి’’ అని కోరారు.
‘‘కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటారా? లేక పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా? అనేది అనుమానమే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్స్ అన్ని ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా వారికి స్వేచ్ఛనివ్వాలి. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని పునరుద్ఘాటించారు.
హరీష్ రావుకు కూడా..
అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తోంది. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం జరిగింది? ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? వంటి అంశాలపై స్పష్టత కోసం సిట్ అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు ఇవ్వాలని సిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

