
తెలంగాణ పల్లెలో ‘ప్రైవేటు చదువు’ వద్దంటూ తిరుగుబాటు
సర్కారు బడికే పిల్లలను పంపిస్తామని ప్రకటన
ఒక అరుదైన తిరుగుబాటు, అందునా చదువుకోసం, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరులో జరగిగింది. ఈ వార్త వినేకేవిడ్డూరంగా ఉంటుంది. నమ్మశక్యంగా ఉండదు. అయినా నిజం. ఏపూరు ప్రజలు ‘మాకు సర్కారు చదువే కావాలి,’ అంటూ ’ మా పిల్లలకు మీరే చదువు చెప్పండి,’ అంటూ వూర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని కోరారు. అంతేనా, కాదు, ఈ కథకి ఇంకోట్విస్ట్ ఉంది. అదేమంటే, తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపేది లేదని,అందువల్ల అదుపు హద్దూ లేకుండా తిరిగే ప్రవేటు స్కూళ్లబస్సులను ఊర్లోకి రానివ్వమని వూరంతా తెగేసి చెప్పారు. ప్రవేటు స్కూళ్ల బస్సులను ఊర్లో ప్రవేశించికుండా అడ్డుకున్నారు.
వింతగా లేదూ, ప్రయివేటు స్కూళ్లమీద, పిల్లలను బస్సులో ఎక్కడో దూరాన ఉన్న ప్రయివేటు స్కూళ్లకూపంపడం మీద మోజు ఉండే ఈరోజుల్లో ఏపూరు ప్రజలు ధైర్యం చేశారు. ప్రభుత్వ పాఠశాలే మేలని నిర్ణయానికి వచ్చారు. ఈ సంఘటన గురువారం నాడు జరిగింది.
ఏపూరు గురించి నాలుగు ముక్కలు
ఏపూరు ఎపుడో వార్తలెక్కింది. అది కూడా జాతీయ వార్తల్లోకి. ఈ వూరి జనాభా 3500. ఇది భిన్నమైన గ్రామం. దీనికి ప్రగతి శీల చరిత్ర ఉంది. 2022-23లో మహిళా స్నేహ పూర్వక (Women Friendly)విభాగంలో జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు ఉందుకుంది. అపుడు జిల్లా అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సర్పంచ్ సానబోయిన రజితాసుధాకర్, గ్రామ కార్యదర్శి ఉమారాణి న్యూఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము నుంచి ఈ ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్’ ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కింది అవార్డు అందుకున్నారు. వివిధ అవసరాల కోసం నిధులను ఆ గ్రామ పంచాయతీ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని అభివృద్ధి కనపరిచింది. గ్రామ జనాభాలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. సర్పంచ్, ఉప సర్పంచి, ఎంపీటీసీగా మహిళలే ఎన్నికయ్యారు. గ్రామంలో బాలికలకు , మహిళలకు ఆత్మ రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పోషకాహారం అందించడం, కరోనా వ్యాక్సినేషన్, హెల్త్ చెకప్ వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ సర్పంచుల బృందం మహిళా విభాగంలో ఉత్తమ పంచాయతీ అవార్డు దక్కించుకున్న ఏపూ ర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ జరిగిన పనులు ప్రశంసించింది.
మరోవైపు గ్రామంలో రూ.3 కోట్లకు పైగా నిధులతో మినీ డైరీ, మిల్క్ సెంటర్, కారం, పిండి మిల్లులు, లేడీస్ కార్నర్, పండ్ల దుకాణాలు, సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు, కిరాణ దుకాణాలు, డెయిరీ ఫామ్స్, టిఫిన్ సెంటర్లు, జ్యూస్ సెంటర్లు, హోటల్స్, మినీ బ్యాంక్, ఇంటర్నెట్ సెంటర్ వంటి 46 యూనిట్లతో వందలాది మంది మహిళలు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకున్నారు.
ఏపూరు లో విద్య
ఏపూరులో ఈ రంగాలలో విద్యా రంగం కూడా ముందుంది. ఇక్కడ ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లో 200 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. గ్రామానికి చెందిన మరో 200 మంది సూర్యాపేటలోని పలుప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు ఆయా పాఠశాలలకు చెందిన ఆరు స్కూల్ బస్సులు నిత్యం గ్రామానికి వస్తుంటాకి. ప్రైవేటు బస్పులు ఎంత అలజడి సృష్టిస్తాయో తెలిసిందే. గురువారం ఉదయం 7.30 గంటలకు ఎప్పటి లాగే రెండు స్కూల్ బస్సుల వూర్లోకి వచ్చాయి. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు, కొంతమంది గ్రామస్థులు బస్సులను అడ్డగించారు. తమ గ్రామం నుంచి విద్యార్థులను తీసుకెళ్లవద్దని వారిస్తుండగానే ఆ రెండు బస్సులు వారిని దాటుకుని వెళ్లిపోయాయి.
మరికొద్ది సేపట్లో మరో నాలుగు బస్సులు వచ్చాయి. ఈ సారి ఎక్కువ మంది గ్రామ ప్రజలు గుమి కూడి వాటిని అడ్డగించి అక్కడే నిలిపేశారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు ఇక నుంచి ఏపూరు గ్రామానికి రావొద్దని హెచ్చరించారు. దీంతో బస్సుల్లోని విద్యార్థుల్లో కొందరు ఇంటికి వెళ్లిపోగా, మరికొందరు తల్లిదండ్రుల సాయంతో ప్రైవేటు పాఠశాలకు వెళ్లిపోయారు.
“సర్కారు బడులు ఉచితంగా విద్యను అందిస్తున్నాయి. అయితే మాయమాటలు చెప్పి ప్రైవేటు పాఠశాలలు తల్లితండ్రులను వశపర్చుకుంటున్నాయి. దానితో వారు తమపిల్లలను వేలల్లో ఫీజులు చెల్లించి ప్రయివేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇలా ఎంవతో సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుకులకు గురి అవుతున్నారు,’ అని గ్రామస్థులు తెలిపారు.
ఈ ఆందోళన వార్త వూరంతటిని కుదిపేసింది.అదే సమయంలో గ్రామానికి చేరుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను స్థానికులు ఘటనాస్థలికి పిలిపించారు. తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు చెప్పాలని ఆ ఉపాధ్యాయులను కోరారు.
ఏపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాసిత్, ఇతర ఉపాధ్యాయులు మంచి విద్య నేర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ఈ వూరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించిని విషయాన్ని వారు పేరెంట్స్ కు తెలిపారు. తమ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. ఆయా విద్యార్థుల్లో ఎంతమంది ప్రైవేటును మాని ప్రభుత్వ బడి బాట పడతారో వేచి చూడాలి.