రైల్వే ట్రాక్ పై కారులో యువతి  రాష్ డ్రైవ్ చేస్తూ...
x

రైల్వే ట్రాక్ పై కారులో యువతి రాష్ డ్రైవ్ చేస్తూ...

రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో చోద్యం


‘జిహ్వకో రుచి పుర్రెకో బుద్దిఅన్నారు పెద్దలు మొదటిది ఏమోకాని రెండో దాని సంగతి చూడాలనుకుంది ఆ యువతి. రంగా రెడ్డి జిల్లా శంకర్ పల్లి రైల్వే ట్రాక్ పై ఆ యువతి చేసిన హంగామా అంతా కాదు. హైవే రోడ్డును వదిలేసి ఆమె తన కారును రైల్వే ట్రాక్ పైకి ఎక్కించేసింది. ఏకంగా ఏడు కిలో మీటర్లు తనే డ్రైవించే చేసింది.

స్థానికులు అడ్డగిస్తున్నప్పటికీ చాకుతో బెదిరించింది. రైల్వే పోలీసులకు, లోకో పైలట్ కు సమాచారమందడంతో ఆ మార్గంలో వచ్చే రైళ్ల రాకపోకలను నిలిపి వేశారు. యువతి చేసిన నిర్వాకానికి రెండుగంటలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శంకర్ పల్లి పోలీసులు స్పాట్ కు చేరుకుని ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన యువతి యుపి లక్నోకు చెందిన రవికా సోనిగా గుర్తించారు.

రీల్స్ కోసం పైత్యం

రీల్స్ కోసం రైల్వే ట్రాక్ పై కారు నడిపినట్లు సమాచారం. హైద్రాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రవికా సోని ఇటీవలె జాబ్ కోల్పోయిందని, అప్పటి నుంచి మతి స్థిమితం కోల్పోయినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. డ్రగ్స్ తీసుకుని కారు నడిపిందా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తేగాని ఆ యువతి డ్రగ్స్ తీసుకుందా లేదా అనేది తేలనుంది.

Read More
Next Story