
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే
‘‘ఫడ్నవీస్ తో విభేదాలు ఉన్నమాట నిజమే’’
అంగీకరించిన ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో తనకు విభేదాలు ఉన్నాయని శివసేన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అంగీకరించాడు. ఒకరిపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్లు తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు.
‘‘అవును.. నేను ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన మాట నిజమే. ఆయన కూడా నాపై ఆరోపణలు చేశారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు, అక్కడ సమస్యలపై జరుగుతాయి. కాబట్టి పార్టీ కార్యకర్తలు ఇందుకోసం పోరాడతారు.
ఇది మీరు అర్థం చేసుకోవాలి’’ అని షిండే ఛత్రపతి శంభాజీనగర్ లో విలేకరులతో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ అంశాలను లేవనెత్తాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీనియర్ నాయకులు వచ్చి ప్రచారంలో పాల్గొనడంలో చూడటాన్ని ఇష్టపడతారని చెప్పారు.
ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు: ఫడ్నవీస్
స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ కార్యకర్తలే నడిపిస్తారని ఫడ్నవీస్ తెలిపారు. తాను ప్రత్యర్థులు, మిత్రపక్షాలపై వ్యాఖ్యలు చేయడం మానుకున్నానని, కేవలం బీజేపీ అభ్యర్థులు గెలవడంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు.
‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు పోటీ చేస్తారు. మా ఎన్నికల సమయంలో మా కార్యకర్తలకు ప్రచారం చేయడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తాము’’ అని ఫడ్నవీస్ అన్నారు.
మమ్మల్ని గెలిపించడానికి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారని, వారిని గెలిపించడం ఇప్పుడు మా బాధ్యత అని ఆయన అన్నారు. ‘‘ముఖ్యమంత్రిగా తాను ప్రత్యర్థులపై, మిత్రపక్షాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను.
ఇవి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఎన్నికలు. నా ప్రత్యర్థులు కూడా. మా మిత్రపక్షాలపై వ్యాఖ్యానించే విషయం పక్కన పెడితే.. ఈ రోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. కానీ నేను ఎవరికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను మా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మాత్రమే ప్రచారం చేస్తాను’’ అని ఆయన అన్నారు.
పూణే మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా
పూణే జిల్లాలోని అనేక మునిపిపాలిటి కౌన్సిల్ కు ఎన్నికలు వాయిదా పడ్డాయని మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కమిషన్ నిర్ణయం గడువు కంటే ఆలస్యంగా జిల్లా కోర్టు తీర్పులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభావిత కౌన్సిల్ లు, వార్డులకు ఎన్నికలు డిసెంబర్ 20కి తిరిగి షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
సభ్యుల అనర్హత లేదా రిజర్వేషన్ సవాళ్లకు సంబంధించిన కేసులు ఇంకా జిల్లా కోర్టుల ముందు పెండింగ్ లో ఉంటే మున్సిపల్ కౌన్సిల్ నగర పంచాయతీ ఎన్నికలు ముందుకు సాగలేమని గతంలో ఎన్నికల సంఘం ఆదేశించిందని అధికారులు తెలిపారు.
జిల్లా కోర్టు ఏం చెప్పింది..
ఈ ఆదేశం ఉన్నప్పటికీ బారామతి మున్సిపల్ కౌన్సిల్, పుర్సుంగి- ఉరులీ దేవాచీ మున్సిపల్ కౌన్సిల్ లో అధ్యక్ష పదవికి సంబంధించిన అప్పీళ్లపై జిల్లా కోర్టు తన నిర్ణయాలను నవంబర్ 26, 2025 మాత్రమే జారీ చేసింది.
ఇది ఎస్ఈసీ కటాఫ్ తేదీ తరువాత నాలుగు రోజులకు విడుదల అయింది. ఈ గందరగోళం కారణంగా అధ్యక్ష, సభ్యుల స్థానాల పోటీలతో సహ రెండు సంస్థలకు ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. వాయిదా పడిన వాటికి డిసెంబర్ 20న ఎన్నికలు జరుగుతాయి.
Next Story

