‘‘సబ్ తీర్థ్ బార్ బార్, గంగాసాగర్ ఏక్ బార్’’
x

‘‘సబ్ తీర్థ్ బార్ బార్, గంగాసాగర్ ఏక్ బార్’’

మకర సంక్రాంతి సందర్భంగా పవిత్ర గంగా సాగర్ లో పుణ్య స్నానాలు చేసిన భక్తులు


సూర్యుడు మకర రాశిలో ప్రయాణించే సందర్భంగా బెంగాల్ లో గంగాసార్ మేళా నిర్వహిస్తారు. పవిత్ర గంగానది, బంగాళాఖాతంలో సంగమించే ప్రాంతంలో పుణ్య స్నానాలు చేయడం బెంగాల్ సంప్రదాయం. ఈ పర్వదినం సందర్భంగా కోల్ కత నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగసాగర్ వద్ద లక్షలాది మంది భక్తులు గుమిగూడారు.


చలికాలమే అయినప్పటికీ వణికే చలిలో గంగానదీలో మునిగి తమ భక్తిని చాటుకున్నారు. తెల్లవారుజామున స్నానాలు చేసి, శాలువాలు చుట్టుకుని కనిపించారు.
ఇక్కడకు చేరుకోవాలంటే చాలా ఓర్పు, ప్రయాణ కష్టాలు ఉంటాయి. అయితే ఇవేవీ వారి భక్తికి అడ్డంకిగా మారలేదు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశించి, మోక్షాన్ని పొందుతారని నమ్ముతున్నారు. తూర్పు భారతంలో ఇది అతిపెద్ద మతాచారం. ఊరేగింపులు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇక్కడ సాధారణంగా కనిపిస్తాయి.
పొడవైన క్యూలు..
మకర సంక్రాంతి నాడు ఇక్కడ పవిత్ర స్నానం కోసం పొడవైన క్యూలలో నిల్చున్న భక్తులు మనకు దర్శనం ఇస్తారు. స్త్రీలు, పిల్లలు, చేతులు పట్టుకుని స్థిరంగా గంగానదీ వైపు కదలడం మనకు కనిపిస్తుంది.
చల్లగా ఉన్న గంగానదీలో పుణ్య స్నానం చేయడం నిజంగా సవాల్ తో కూడుకున్నది. దీనికి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఎక్కువ. చాలామంది భక్తులకు ఇది ఎంతో వ్యక్తిగతమైనది. జీవితంలో ఒక్కసారైన ఇక్కడ స్నానం చేయాలని తలపొస్తారు.
భక్తితో ప్రయాణాలు..
ఈ పుణ్య స్నానానికి భక్తులు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ సహ దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా తరలివస్తారు. రైళ్లు, బస్సులు కిక్కిరిసి ఉన్నప్పటికి తమ సంకల్ప బలం చేత ఇక్కడకు చేరుకుంటారు.
ద్వీపం అంతటా మనకు అనేక గుడారాలు కనిపిస్తాయి. ఇక్కడ మనకు చిన్న,పెద్ద, అనేక జాతులు, భాషా కుటుంబాలు దర్శనమిస్తాయి. బూడిద పూసుకున్న సాధువులు కూడా కనిపిస్తారు. కొందరు ఆశీస్సులు అందిస్తున్నారు. మరికొందరు జపతపాదుల్లో మునిగిపోతున్నారు. కొందరు దుగ్గి వంటి సాధారణ వాయిద్యాలను వాయిస్తూ ఉన్నారు.
కపిల మునితో సంబంధం..
గంగా సాగర్ కు పురాణ కాలం నేపథ్యం ఉంది. రామాయణంలోని సగర పుత్రుల కథ ఇక్కడ మనకు వినిపిస్తుంది. సగరుడిడి చెందిన అరవై వేల మంది పుత్రులను కపిల మహర్షి ఒక్క హుంకారంతో భస్మీపటలం చేయగా, వారి ఆత్మ శాంతి కోసం భగీరథుడు వేల సంవత్సరాలు తపస్సు చేసి గంగను దివి నుంచి భువికి రప్పించి, వారి బూడిద కుప్పల మీదుగా ప్రవహింప చేసి వారి ఆత్మలకు మోక్షం కలిగించాడని రామాయణం చెబుతుంది.
‘‘సబ్ తీర్థ్ బార్ బార్, గంగాసాగర్ ఏక్ బార్’’ అనే నానుడి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మహిళలు పవిత్ర స్నానం తరువాత సిందూరం మార్చుకుంటారు. సాధువులు సూర్యభగవానుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
గంగా సాగర్ నుంచి కపిల ముని ఆలయం వైపు ఆధ్యాత్మిక యాత్రలు కొనసాగుతాయి. గంగాదేవీ విగ్రహాలను తీసుకున్న వస్తున్న వారు క్రమశిక్షణతో ముందుకు వెళ్తారు. ఇక్కడ మనకు అనేకమంది వాలంటీర్లు దర్శనం ఇస్తారు.
ఆచారాలకు అతీతం..
ఆచారాలకు అతీతంగా ఈ మేళాలో సంస్కృతి జానపదాల వేడుక కనిపిస్తుంది. గంగా హారతితో పాటు వ్యవస్థీకృత ప్రదర్శనలు, నృత్యం, సంగీతంతో భక్తిని మిళితం చేస్తాయి. శివుని వేషధారణలో ఉన్న భక్తులు, గోపాల్ బార్ చిత్రీకరిస్తున్న వారు కనిపిస్తారు.
రాత్రి ప్రార్థనలు..
రాత్రి కాగానే ఇక్కడ ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. కపిలముని ఆలయం అలంకారాలతో ముస్తాబవ్వగా, ద్వీపం అంతటా మిణుకు మిణుకు అంటూ వెలుగులు కనిపిస్తుంటాయి. భక్తి ఘోషకు అలలు తమ కోరస్ ను అందిస్తాయి.
యాత్రికుల మాటలు..
ఇక్కడకు వచ్చిన యాత్రికులు విశ్వాసం, సంతృప్తి, పట్టుదల గురించి మాట్లాడుకుంటూ కనిపిస్తారు. కోల్ కతకు చెందిన మహిళ కవితా సాహ మాట్లాడుతూ.. శారీరక కష్టాలు, ఉన్నప్పటికీ ఈ ప్రయాణం అనుకున్నట్లుగా సాగిందని చెప్పారు. జార్ఖండ్ కు చెందిన ఉపాధ్యాయురాలు రంజనా దేవి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తానని చెప్పారు. వారి మాటల్లో భక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
శాశ్వత ప్రవాహం..
అలలు కొనసాగుతూనే ఉన్నాయి. నీరు పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. కానీ యాత్రికులు అక్కడ గుమిగూడుతూనే ఉన్నారు. గంగాసాగర్ భారత ఆధ్యాత్మిక ప్రకృతి దృశ్యంలో లోతుగా ప్రవహించే నమ్మకానికి శాశ్వత సాక్షిగా మిగిలిపోయింది. ప్రతి సంవత్సరం భక్తుల విశ్వాసం ఈ పవిత్ర సంగమ స్థలానికి తిరిగి తీసుకువస్తుంది. ఇక్కడ ఆచారం, జ్ఞాపకాలు, భక్తి నిశ్శబ్ధంగా సముద్రుడిలో నది కలిసినట్లు కలిసిపోతాయి.
Read More
Next Story