
బిసిల నుండి ఒక ఎన్ టి ఆర్, కేసిఆర్ తరహా నాయకులు రారా... రాలేరా?
బిసిలు …ఎప్పటినుండో తెలుగు నాట ఎందరో రాజకీయ నాయకుల వోట్ బ్యాంక్ పాలిటిక్స్ కి ఎంతగానో ఉపయోగపడ్డారు. అలాగే ఎందరో నాయకులుగా బిసి వర్గం నుండి ఎదిగి తమ రాజకీయ భవిష్యత్తుకి బిసి వాదాన్ని ఒక అవకాశవాదంగా మార్చుకున్నారు. అయితే దీనికి ప్రధాన కారణాలుగా బిసిల అనైక్యతను ప్రముఖ బిసి మేధావులు, విశ్లేషకులు పేర్కుంటున్నారు. అయితే ఇదొక్కటే కారణమా?లోతుగా చూస్తే ఇంకెన్నో విషయాలు కనిపిస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ టి ఆర్ కాంగ్రెస్ కు ఎదురొడ్డి ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ‘తెలుగు దేశం’ తో చరిత్ర సృష్టించారు. ఆయన విజయం వెనుక కేవలం కమ్మ సామాజిక వర్గం మాత్రమె ఉందా? ఒకవేళ అది మాత్రమే ఉందనుకుంటే మొత్తం జనాభాలో వారి శాతం చాలా తక్కువ. అంటే కేవలం ఒక వర్గం యొక్క జనాభా అన్నది ఆ వర్గ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించే అధికారం కలిగి ఉంటుందన్నది వాస్తవం కాదని ఎన్ టి ఆర్ నిరూపించారు. అలాగే కెసి ఆర్ తెలంగాణా ఉద్యమ నినాదంతో కావొచ్చు, స్వంత ప్రయోజనాల కోసం కావొచ్చు; ఏదేమైనా తెలంగాణా చరిత్రలో మర్చిపోలేని నాయకుడిగా నిలిచాడు. ఇక వైయస్సార్,చంద్రబాబు నాయుడుల ముద్ర కూడా తక్కువేం కాదు.వీరికి కుల సమీకరణలే అనుకూలించాయా? అంటే వంద శాతం అదే కారణం అని చెప్పలేము,అనేక కారణాల్లో అది ఒక్కటి మాత్రమే. కనుక బిసిల నుండి ఇంత బలమైన నాయకులు రాకపోవడానికి కారణాన్ని ఈ అనైక్యతగా భావించలేము.
మరి అసలు బిసిలలో బలమైన నాయకత్వాన్ని అడ్డుకుంటున్న ముఖ్య అంశం ఏంటి? దీనికి కారణం ఒక సోషల్, సైకలాజికల్ కండిషనింగ్ అని అనిపిస్తుంది. అగ్ర కులాల సామాజిక వాతావరణంలోనే ఒక ఆర్ధిక ఆధిపత్యం, విద్యాధికత,అలాగే కుటుంబంలో ముందు తరాల వారు రాజకీయాల్లో భాగమై ఉండటం వంటివి కనిపిస్తాయి. ఇక్కడ ఇలాంటి వాతావరణంలో పెరిగిన వారికి భవిష్యత్తు లో దానికి తమ వారసత్వ కొనసాగింపునే ముఖ్యమైన అంశంగా చూస్తారు. అందుకే వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బావుంటాయి. కానీ బిసిల్లో ఆర్ధిక వెనుకబాటుతనం, చదువుకోలేకపోవడం వంటి అంశాల వల్ల వారిలో ఉన్న న్యూనత వారి భవిష్యత్ ఆచరణలో కూడా కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి బిసిల నుండి ఇక భవిష్యత్ లో అయినా ఎన్ టి ఆర్ ,కేసిఆర్ లాంటి నాయకులు వస్తారా? అన్న అంశం మీద ఫెడరల్ తెలంగాణా కోసం నిర్వహించిన చర్చ …