
బాలీవుడ్ లో వివక్ష ఉందా? రెహమాన్ వ్యాఖ్యల వెనక అర్థం ఏమిటీ?
ఏఐ విత్ సంకేత్ లో చర్చా కార్యక్రమం, రెహమాన్ కు అవకాశాలు తగ్గడంలో మత ప్రాముఖ్యం ఉందా..
సంకేత్ ఉపాధ్యాయ
బాలీవుడ్ పై ఆస్కార్ అవార్డు గ్రహీత, స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ చేసిన మతతత్వ వ్యాఖ్యలపై ‘ఏఐ విత్ సంకేత్’ లో చర్చ జరిగింది. గిరిష్ వాంఖడే, అభిషేక్ త్రిపాఠీ, టీ. రామకృష్ణన్, సైరా షా హలీమ్ తో కూడిన ప్యానెల్ చర్చలో పాల్గొనగా, సంకేత్ ఉపాధ్యాయ దీనిని నిర్వహించారు.
ఆయన వ్యాఖ్యల్లో వివక్షత, మారుతున్న సినీ పరిశ్రమ తీరు, హిందీ సినిమాలో సృజనాత్మకత ఏదైన లోపించిందా? అని ప్యానెల్ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సంభాషణలో రెహమాన్ వ్యాఖ్యల వెనక అర్థాలను వెతికే పనిచేసింది. మారుతున్న అధికార కేంద్రాలు, సంగీతంపై కార్పొరేట్ల నియంత్రణ, సినిమాలలో జాతీయవాద ప్రభావం, ప్రేక్షకుల అభిరుచి వంటి వాదనలను వివరించింది.
రాజకీయాలు, వివక్ష గురించి చాలాకాలంగా మాట్లాడటానికి రెహమాన్ మాట్లాడటానికి ఇష్టపడలేదని, అయితే హఠాత్తుగా ఇవి ఆయన నోటివెంట రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
బాలీవుడ్ లో రెహమాన్ ఎప్పుడైన వివక్షను ఎదుర్కొన్నారా అనే ప్రశ్నకు రెహమాన్ సమాధానమిస్తూ.. తనెప్పుడు ప్రత్యక్షంగా అనుభవించలేదని సమాధానం ఇచ్చారు. అయితే గత ఏడేనిమిది సంవత్సరాలు దీనితీరు మారిందని పేర్కొన్నారు. సృజనాత్మకత లేని శక్తులు ఎక్కువగా ఇప్పుడు బాలీవుడ్ ను నడుపుతోందని పేర్కొన్నారు.
ఆయన కమ్యూనల్ అనే పదాన్ని ఉపయోగించడం ఇక్కడ తీవ్ర చర్చలకు దారితీసింది. బాలీవుడ్ బహిష్కరణకు గురైందా అని ప్యానెల్ కూడా చర్చలో ప్రశ్నను లేవనెత్తింది.
తీవ్రమైన ఆరోపణ..
రెహమాన్ ప్రకటన తీవ్రమైన ఆరోపణ అని దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని సినీ వాణిజ్య విశ్లేషకుడు గిరిష్ వాంఖడే ఏఐ విత్ సంకేత్ తో అన్నారు. ముస్లిం గీత రచయితలు, గాయకులు, స్వరకర్తలు సహకారాన్ని, బాలీవుడ్ చారిత్రాత్మకంగా అందరిని కలుపుకుపోయిందని ఆయన వాదించారు.
రెహమాన్ ఆందోళనలు మతపరమైన పక్షపాతం కంటే పరివర్తన చెందిన సంగీత వ్యవస్థల నుంచి ఎక్కువగా వస్తున్నాయని వాంఖడే అభిప్రాయపడ్డారు. ప్రతి చిత్రానికి అనేక మంది మ్యూజిషియన్స్ పెరగడం, యువ సంగీతకారుల నుంచి తీవ్రమైన పోటీ, సంగీతానాన్ని పూర్తిగా నిర్మాత నేతృత్వంలోని వారిచే నడుస్తున్నాయని ఆయన చెప్పారు. ‘‘రెహమాన్ ఒక మేధావి, కానీ నేడు భారీ పోటీ ఉంది’’ అని వాంఖడే అన్నారు.
బీజేపీ స్పందన..
చిత్ర నిర్మాత బీజేపీ ప్రతినిధి అభిషేక్ త్రిపాఠీ ఏఐ విత్ సంకేత్ లో మాట్లాడుతూ.. రెహమాన్ వాదనను తిరస్కరించారు. ఇది బాధ్యతారాహిత్యమని చెప్పారు. హిందీలో సినిమాలో రెహ్మన్ ప్రశంసలు, వాణిజ్య విజయాన్ని అందుకుంటూనే ఉన్నారని ఆయన నొక్కి చెప్పారు.
నేటీ సినిమాలు సిద్దాంతపరంగా కాకుండా, మార్కెట్ ఆధారితంగా నిర్మాణం జరుపుకుంటున్నాయని త్రిపాఠి తెలిపారు. ‘‘సినిమా రాజకీయా అజెండాలను కాకుండా ప్రేక్షకుల డిమాండ్ ను ప్రతిబింబిస్తుంది’’ అని ఆయన అన్నారు.
సినిమాల్లో జాతీయతను మతతత్వంతో సమానం కాకూడదని అన్నారు. బడ్జెట్ ఒత్తిడి, కఠినమైన సమయపాలనలను కూడా ఆయన ఎత్తి చూపారు. రెహమాన్ శైలి ప్రస్తుత కాలానికి అనుగుణంగా లేకపోవచ్చని సూచించారు.
పరిశ్రమ మార్పు..
సీనియర్ జర్నలిస్ట్ టీ రామకృష్ణన్ సంకేత్ ఏఐ విత్ సంకేత్ లో మాట్లాడుతూ.. రెహమాన్ వ్యాఖ్యలను విశ్లేషణాత్మకంగా పరిశీలించాలని కోరారు. రెహమాన్ స్థాయిని అంగీకరిస్తూనే తన కెరీర్ లో ఈ సమయంలో స్వరకర్త ఈ ఆందోళనలను ఎందుకు లేవనెత్తారని ఆయన ప్రశ్నించారు.
రెహమాన్ వివక్షత కంటే సృజనాత్మక స్తబ్ధతను ఎదుర్కొంటున్నాడని సూచించారు. ‘‘ప్రతి కళాకారుడికి ఒక శిఖరం ఉంటుంది’’ అని ఆయన అన్నారు. వృత్తిపరమైన సవాళ్లను మతపరమైన కథనం రూపొందిస్తున్నారని హెచ్చరించారు. ఇది సామాజిక విభజనలను తీవ్రతరం చేసే కథనంగా పేర్కొన్నారు.
శక్తి కేంద్రాలు..
మిగిలిన ప్యానెల్ తో రచయిత్రి కార్యకర్త సైరా షా హలీమ్ విభేదించారు. రెహమాన్ వ్యాఖ్యలను విస్తృత సామాజిక రాజకీయ కోణంలో చూశారు. కళాకారుల నుంచి కార్పొరేట్ లేబుల్, సైద్దాంతిక అధికారం మారిందని చెప్పుకొచ్చారు.
‘‘సృజనాత్మక ప్రక్రియే రాజీ పడింది’’ అని హలీమ్ అన్నారు. సినిమా ఆధిపత్య రాజకీయ కథనాలను ప్రతిబింబిస్తుందని, ప్రయోగానికి బదులు అనుగుణ్యతకు ప్రతిఫలం ఇస్తుందని వాదించారు.
అభిరుచిమారింది..
మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల బాలీవుడ్ సంగీత నేపథ్యాన్ని మార్చివేశాయా అనే కోణంలోనూ చర్చ సాగింది. వాంఖడే, త్రిపాఠి సోషల్ మీడియా ఆధారిత సంగీత విద్వాంసులు, కొత్తతరం శైలులకు దక్కుతున్న ఆదరణను హైలైట్ చేశారు.
రెహమాన్ తో అనుబంధం ఉన్న వాళ్లు కూడా ఇకముందు ప్రధాన సినిమాల్లో తమ ఆధిపత్యం చూపడం లేదని వారు అన్నారు. అయితే వీటిని హలీమ్ వ్యతిరేకించారు.
మతపరమైన ప్రశ్న..
రెహమాన్ మతపరమైన గుర్తింపు అతని వృత్తిపరమైన అనుభవంలో ఏదైన ప్రధాన పాత్ర పోషించిందా అన్నదే ప్రధాన అంశం. సినిమా అంతటా విజయవంతమైన ముస్లిం కళాకారుల చరిత్రను ఉటంకిస్తూ త్రిపాఠీ ఈ వాదనను తోసిపుచ్చింది. విజయం దుర్భలత్వాన్ని తిరస్కరించదని హలీమ్ అన్నారు.
సృజనాత్మక నష్టం..
చర్చలో ప్రముఖ వినోద జర్నలిస్ట్ డెంజిల్ ఓ కానెల్ కేంద్రీకృత కార్పొరేట్ నియంత్రణ బాలీవుడ్ సంగీత పరిశ్రమను ఎలా పునర్మించిందో హైలైట్ చేశారు. మణిరత్నం వంటి సృజనాత్మకత ఉన్న వారితో జట్టు కట్టినప్పుడూ రెహమాన్ అభివృద్ధి చెందాడని అయితే పరిశ్రమలో ఇలాంటి సహకారం చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు.
రెహమాన్ వ్యాఖ్యలు పూర్తిగా తిరస్కరించడానికి బదులుగా తీవ్రమైన చర్చకు అర్హమైనవని సంకేత్ ప్యానెల్ తో కూడిన ఏఐ తేల్చింది. బాలీవుడ్ మతతత్వంగా మారుతుందా లేదా అనే దానిపై పాల్గొనేవారు విభేదించినప్పటికీ పరిశ్రమ లోతైన పరివర్తన చెందుతోందని అందరూ అంగీకరించారు.
ఈ చర్చ సృజనాత్మక వాణిజ్యం, కళాత్మక వారసత్వం, సమకాలీన అభిరుచి, స్వేచ్ఛ అనుగుణ్యత మధ్య ఉద్రిక్తతలను నొక్కి చెప్పింది. రెహమాన్ వ్యాఖ్యలు వ్యక్తిగత నిరాశను ప్రతిబింబిస్తున్నాయా లేదా లోతైన సాంస్కృతిక మార్పును ప్రతిబింబిస్తాయా అనేది ఇంకా పరిష్కారం కాలేదు. కానీ ప్యానెల్ గుర్తించినట్లుగా ఏఆర్ రెహమాన్ వంటి నిరాడంబరమైన వ్యక్తి మాట్లాడినప్పుడూ పరిశ్రమ వినవలసి వస్తుంది.
Next Story

