స్వరాష్ట్రంలో స్థానికత కోసం పోరాటం ఇంకెన్నాళ్ళు!!!
x

స్వరాష్ట్రంలో స్థానికత కోసం పోరాటం ఇంకెన్నాళ్ళు!!!


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక అయిన 'స్థానికత' అంశం ఇప్పుడు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 కారణంగా తమ సొంత జిల్లాలను వదులుకోవాల్సి వచ్చిందని, సీనియారిటీ ప్రాతిపదికన జరిగిన కేటాయింపులు తమ ప్రాథమిక హక్కులను కాలరాశాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన యోచనలో ఉన్న నేపథ్యంలో, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక అయిన 'స్థానికత' అంశం ఇప్పుడు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 కారణంగా తమ సొంత జిల్లాలను వదులుకోవాల్సి వచ్చిందని, సీనియారిటీ ప్రాతిపదికన జరిగిన కేటాయింపులు తమ ప్రాథమిక హక్కులను కాలరాశాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన యోచనలో ఉన్న నేపథ్యంలో, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం జారీచేసిన జీవో 317 వలన స్థానికత (ఉద్యోగం పొందే సమయంలో రికార్డులలో నమోదు చేసిన జిల్లా) కోల్పోయామని ఉద్యోగస్తులు ఆందోళన చేసినా వారిది అరణ్యరోదన అయ్యింది. ఈ సమస్య వలన 16,000 మంది ప్రభావితం అయ్యారని ఆ సమస్యపై పోరాడుతున్న ఉద్యోగస్థుల, ఉపాధ్యాయుల యూనియన్ పేర్కొంది. ఈ సందర్భంలోనే ప్రతి ఓటును తమ గెలుపుకు మెట్టుగా పరిగణించిన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సమస్యపై అధ్యయనానికి ముగ్గురు మంత్రివర్గ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

“స్థానికత కోసమే తెలంగాణా ప్రాంతంలో ముల్కీ ఉద్యమం, త్రీ పాయింట్ ఫార్ములా, పెద్దమనుషుల ఒప్పందం జరిగాయి. పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి జీవో 317 ఆర్టికల్ 371-డి కి వ్యతిరేకంగా వుందని అన్నారు. శ్రీధర్ బాబు అసెంబ్లీ లో 2024 లో ఒప్పుకున్నారు. బీజేపీ కూడా అనుకూలంగా వుంది. బండి సంజయ్ నిరాహారదీక్ష చేశారు. మేము ఇటీవల బిజెపి అద్యక్షుడు రామచందర్ రావు ను కలవగా త్వరలో సిఎం కు ఉత్తరం రాస్తామని చెప్పారు. అవసరం అయితే 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో మార్పులు చేసి మాకు న్యాయం చేయాలి,” అని బోయిన నాగేశ్వర రావు అన్నారు.

“ఒకటి నుండి ఏడవ తరగతి వరకు చదివిన జిల్లానే స్థానిక జిల్లా గా పరిగణించాలని 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో వుంది. కొత్త గా చేరుతున్న ఉద్యోగస్తులకు సంబంధించి దీని ఆధారంగానీ స్థానికత నిర్ధారిస్తున్నారు. దీన్నే ఉద్యోగాలలో ఉన్న మాకూ వర్తింపచేయాలని మేము అడుగుతున్నాం,” అని విజయ్ కుమార్ నొక్కి చెప్పారు.

“ఇప్పటికైనా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగస్థులను స్థానిక జిల్లాలకు పంపాలి. జోనల్ సిస్టమ్ ను గౌరవించాలి. పాత మెదక్ జిల్లాను మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలుగా చేశారు. సిద్దిపేట, మెదక్ ను రాజన్న జిల్లాలో వుంచిన బిఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి ని మాత్రం చార్మినార్ జోన్ కు మార్చింది. జిల్లా స్థాయి ఉద్యోగస్థులయిన ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులు దీనివలన స్థానికత కోల్పోయారు. దీన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్తున్న ప్రభుత్వం పరిష్కరించాలని,” యూటీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు.


Read More
Next Story