ఈ సారి ఐపీఎల్‌లో 15 మంది తెలుగు కామెంటేటర్లు...
x

ఈ సారి ఐపీఎల్‌లో 15 మంది తెలుగు కామెంటేటర్లు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో 170 మంది క్రికెట్ నిపుణులను రంగంలో దించారు.ఐపీఎల్ మ్యాచ్ లపై 15 మంది తెలుగు కామెంటేటర్లు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నారు.


తెలుగు భాషలో ఐపీఎల్ వ్యాఖ్యాతలుగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఇతర మాజీ క్రికెటర్లు వ్యవహరించనున్నారు. మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా ఈ సారి తన కామెంట్రీతో ప్రేక్షకులను అలరించనున్నారు. తెలుగు భాషలో మహిళా క్రికెటర్ మిఠాలీరాజ్,అంబటి రాయుడు, హనుమా విహారి, ఎంఎస్ కే ప్రసాద్, ఆర్ శ్రీధర్, టి సుమన్, కల్యాణ్ కృష్ణ, ఆశిష్ రెడ్డి, అక్షత్ రెడ్డి, ఎన్సీ కౌశిక్, కె కొల్లారాం, వీజే శశి, వింధ్య, నందు, ప్రత్యూషలు క్రికెట్ కామెంట్రీ చేయనున్నారు. పంజాబీ, తమిళ్, కన్నడ, మళయాళం, హర్యాన్వీ, బెంగాలీ, భోజ్ పురి, గుజరాతీ, మరాఠీ భాషల్లోనూ వ్యాఖ్యతలు ఐపీఎల్ మ్యాచ్ సందడి గురించి ప్రేక్షకులను కనువిందుచేయనున్నారు.

170 మంది రంగంలో...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో మొదటిసారి 170 మంది క్రికెట్ నిపుణులను రంగంలో దించారు. ఈ ఐపీఎల్ మ్యాచ్ లపై జియోస్టార్ లీనియర్ టీవీ, డిజిటల్ లో 12 భాషల్లో 25 ఫీడ్ల ద్వారా క్రికెట్ క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నారు. టీవీలో ఇంగ్లీష్ ఫీడ్‌తో పాటు, నెట్‌వర్క్ జియోస్టార్ అంతటా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కవరేజీని అందించనున్నారు. డిజిటల్‌లో 18వ సీజన్ 16 ఫీడ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, హర్యాన్వీ, బెంగాలీ, భోజ్‌పురి, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, పంజాబీ భాషల్లో క్రికెట్ సమాచారం అందించనున్నారు.


ప్రముఖుల వ్యాఖ్యలతో ఐపీఎల్ లో సందడి
ప్రముఖ బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్ టాటా ఐపీఎల్ లో వ్యాఖ్యాతగా అరంగేట్రం చేయనున్నారు. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, మురళీ విజయ్, కేదార్ జాదవ్ వంటి మాజీ ఐపీఎల్ కెప్టెన్లు కూడా వ్యాఖ్యతలుగా వ్యవహరించనున్నారు.అనిరుధ్ శ్రీకాంత్, కె శ్రీకాంత్ అనే తండ్రీకొడుకుల ద్వయం తమిళ నిపుణుల ప్యానెల్‌లో కలిసి ఉంటారు.2012 ఐపీఎల్ ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయిన మన్వీందర్ బిస్లా హర్యాన్వి ఫీడ్‌కు వ్యాఖ్యాతగా ఉంటారు.జియోస్టార్ టాటా ఐపీఎల్ దిగ్గజాలు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్, జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమ్మిన్స్ వంటి కెప్టెన్ల చుట్టూ ఉన్న వ్యాఖ్యాతలు అభిమానుల కోసం ఉత్తేజకరమైన కంటెంట్‌ను అందించనున్నారు.



ఎందరో మాజీ క్రికెటర్లు వ్యాఖ్యాతలుగా...

వరల్డ్ ఫీడ్ ను రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, హర్ష భోగ్లే, మురళీ కార్తిక్, దీప్ దాస్ గుప్తా, అంజుమ్ చోప్రా, వరుణ్ ఆరోన్, డబ్ల్యూవీ రామన్, మాథ్యూ హేడెన్, షేన్ వాట్సన్, మైఖేల్ క్లార్క్, ఆరోన్ ఫించ్, ఇయాన్ స్వాన్ మోర్గాన్, గ్రేన్‌మీ మోర్గాన్, డౌల్, డానీ మారిసన్, కె మార్టిన్, మ్పుమెలెలో ంబంగ్వా, నటాలీ జర్మనోస్, ఇయాన్ బిషప్, డారెన్ గంగా అందించనున్నారు.హిందీలో ఫీడ్ ను వీరేంద్ర సెహ్వాగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొహమ్మద్ సింగ్, ప్రజ్హా కైఫ్, పీయూష్ కైఫ్, ఓ. మంజ్రేకర్, సంజయ్ బంగర్, వరుణ్ ఆరోన్, సునీల్ గవాస్కర్, అజయ్ జడేజా, జతిన్ సప్రు, అనంత్ త్యాగి, సబా కరీం, దీప్ దాస్‌గుప్తా, ఆకాశ్ చోప్రా అందిస్తారు.


Read More
Next Story